తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు. ప్రైవేటు వాహనాలు ఉన్నవారి విషయం పక్కనపెడితే… ఇతర మార్గాల ద్వారా వెళ్లే వారు ముందస్తుగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం పక్కా ప్లాన్ ఉండాలి. పైగా దర్శనం కూడా గంటల సమయం వేచి చూడాలి.
ఇవన్నీ పక్కనపెడితే… భక్తుల కోసం తెలంగాణ టూరిజం అద్భుతమైన ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. తిరుమలకు తీసుకెళ్లటంతో పాటు దర్శనం కూడా చేయిస్తుంది. ఇదంతా కూడా ఒక్క ప్యాకేజీలోనే పొందుతారు. పైగా తక్కువ ధరలోనే ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే కేవలం ఒక్క రోజులోనే తిరుమలకు వెళ్లి హైదరాబాద్ కు వచ్చేయవచ్చు..! https://tourism.telangana.gov.in/home వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
హైదరాబాద్ తిరుమల టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు చూస్తే పెద్దలకు రూ. 3,700గా ఉంది. ఇక చిన్నారులకు రూ. 2,960గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీలో తిరుమలలో శ్రీవారి శీఘ్రదర్శనం ఉచితంగా ఉంటుంది. https://tourism.telangana.gov.in/package/tirupatitirumalatour ఈ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేస్తే ఈ ప్యాకేజీ వివరాలు ఓపెన్ అవుతాయి.