కళ్యాణలక్ష్మి పథకానికి తెలంగాణ ప్రభుత్వం తాజాగా రూ.1225.43 కోట్లు విడుదల చేసింది. ఈ సంవత్సరం 2024-25 బడ్జెట్లో కళ్యాణ లక్ష్మి పథకానికి రూ.2175.00 కోట్లు కేటాయించింది. మొదటి దశలో రూ.1225.43 కోట్లు విడుదల చేసింది.
పెండింగ్ దరఖాస్తులతో పాటు తాజాగా అప్లై చేసుకున్న వారికి కూడా నిధులు విడుదల చేసింది. కళ్యాణ లక్ష్మి కోసం మొత్తం 65,026 దరఖాస్తులు చేసుకోగా ఈ సంవత్సరం 2024-25కి గాను ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 33,558 దరఖాస్తులు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం 31 మార్చి 2024 వరకు 31,468 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఎమ్మార్వో వద్ద పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు 28,225 కాగా .. ఆర్డీవో వద్ద 12,555 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. 208 దరఖాస్తులు వివిధ కారణాలతో రిజెక్ట్ అయ్యాయని వివరించారు.
పెండింగ్ దరఖాస్తులు పోగా మిగిలిన 24,038 దరఖాస్తులకు నిధులు మంజూరు అయ్యాయని మంత్రి పొన్నం ప్రకటించారు. మొదటి దశలో విడుదల అయిన 1225.43 కోట్లలో మొత్తం దరఖాస్తులు కోసం రూ .649 .86 కోట్లు డిమాండ్ ఉందన్నారు. మంజూరు అయిన దరఖాస్తుల కోసం రూ 240. 73 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. ఇంకా రూ 984.70 కోట్లు రిమైనింగ్ బడ్జెట్ ఉందని పేర్కొన్నారు.
బడుగు బలహీన వర్గాలకు చెందిన ఆడ బిడ్డల పెళ్లిళ్ల సహాయం కోసం కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా 1,00,116 రూపాయలు సహాయం చేస్తుంది. ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూడా 1225.43 కోట్లు మంజూరు చేయడం పట్ల బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు చెప్పారు.