ఎస్సీ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. ఉపకార వేతనాల కోసం ఇవాళ్టి(ఆగస్టు 14) నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది.
అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబరు 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేసుకోవచ్చని వివరించింది.
ఈ పథకానికి ఎంపికైన విద్యార్ధులకు గరిష్టంగా 20లక్షల వరకు ఆర్ధిక సాయం అందిస్తారు. వీసా ఛార్జీలతో పాటు ఒకవైపు విమాన ప్రయాణ ఖర్చులు చెల్లిస్తారు. కుటుంబంలో ఒక్కరికే మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. గ్రాడ్యుయేషన్లో 60శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు జిఆర్ఈ, జి మ్యాట్ స్కోర్లను పరిగణలోకి తీసుకుంటారు.
అభ్యర్థులు సాధించిన స్కోర్కు విదేశీ విద్యానిథి పధకంలో 20శాతం వెయిటేజీ ఉంటుంది. టోఫెల్, ఐఈఎల్టీఎస్, పిటిఇలకు 20శాతం ఇస్తారు. మెరిట్ లిస్ట్ ఎంపికలో స్కోర్ పరిగణలోకి తీసుకుంటారు. విదేశాల్లోఅడ్మిషన్ పొందే యూనివర్శిటీల్లో స్కోర్ పరిగణలోకి తీసుకోకపోయినా దరఖాస్తు సమయంలో మాత్రం వాటిని పేర్కొనాల్సి ఉంటుంది.
టాపిక్