(1 / 8)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారాయి. భానుడి భగభగలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 దాటితే చాలు… ఎండల తీవ్రత పెరిగిపోతుంది. మిట్ట మధ్యాహ్నం తర్వాత అయితే బయటికి అడుగుపెట్టలేని పరిస్థితి ఉంటుంది.
((photo source from https://unsplash.com/)(2 / 8)
తెలంగాణలో ఇవాళ, రేపు వాతావరణం పొడిగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరపికలను జారీ చేసింది.
(Photo Source @APSDMA Twitter)(3 / 8)
మే 05, 06 తేదీల్లోనూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో జనం ఉకిరిబికిరి అవుతున్నారు. పిల్లలు, వృద్ధులు వడ గాడ్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
(4 / 8)
(5 / 8)
మరోవైపు తెలంగాణకు ఐఎండీ చల్లని కబురు చెప్పింది. మే6వ తేదీన రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కట్ చేస్తే... పలు జిల్లాల్లో వడగాల్పుల తీవ్రత ఉంటుందని.... ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.
(6 / 8)
మే 6, 7, 8 తేదీల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గాలి వేగం గంటకు 30 -40 కి.మీ ఉంటుందని పేర్కొంది.
(7 / 8)
మే 10వ తేదీ వరకు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
((photo source from https://unsplash.com/)(8 / 8)
ఇక గత రెండు రోజులుగా ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలే కాకుండా… ఉక్కపోత కూడా బాగా పెరిగిపోయింది. ఫ్యాన్లు, కూలర్ల కింద ఉన్నప్పటికీ ఉక్కపోతతో జనాలు ఇబ్బందిపడుతున్నారు. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.. ఎండదెబ్బ తగలకుండా టోపీ,గొడుగు,టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని చెబుతున్నారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలంటున్నారు.
((photo source from https://unsplash.com/)ఇతర గ్యాలరీలు