Mob thrashes police : ‘నేను పోలీస్​ ఆఫీసర్​’ అని చెప్పినా వదల్లేదు- దారుణంగా కొట్టారు.. అసలేం జరిగింది?-viral video mob thrashes cop after road rage incident in ups varanasi ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mob Thrashes Police : ‘నేను పోలీస్​ ఆఫీసర్​’ అని చెప్పినా వదల్లేదు- దారుణంగా కొట్టారు.. అసలేం జరిగింది?

Mob thrashes police : ‘నేను పోలీస్​ ఆఫీసర్​’ అని చెప్పినా వదల్లేదు- దారుణంగా కొట్టారు.. అసలేం జరిగింది?

Sharath Chitturi HT Telugu

Mob thrashes police : యూపీలో ఓ పోలీసుపై కొందరు దాడి చేశారు. దారుణంగా చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

ఆటోని ఢీకొట్టిన కారు- పోలీసును చితకబాదిన స్థానికులు..!

ఉత్తరప్రదేశ్​లో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది! వారణాసి జిల్లాలో ఓ పోలీసును అల్లరిమూకలు చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వరల్​గా మారింది.

ఇదీ జరిగింది..

రాజతలాబ్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి అజిత్ వర్మ కారు.. ఆదివారం సాయంత్రం ఆటోను ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. భయంతో భార్యాపిల్లలు వాహనం లోపల వేచి ఉండగా.. గుంపు పోలీసులపై పంచ్​లు, దెబ్బల వర్షం కురిపించింది.

ఈ ఘటన మొత్తాన్ని కొందరు కెమెరాలో బంధించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

ఆటోను ఢీకొన్న తర్వాత ప్రజలు కారును చుట్టుముట్టి సదరు పోలీసును వాహనం నుంచి బయటకు లాగి చితకబాదారు.

రోహనియా నుంచి వారణాసికి కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిన సమయంలో పోలీసులు సివిల్​ డ్రెస్​లో ఉన్నాడు.

తాను రాజతలాబ్ పోలీస్ స్టేషన్ హెడ్ ఆఫీసర్ (ఎస్​హెచ్ఓ) అని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు! తాను పోలీస్​ అన్న మాటలు.. కోపంతో ఉన్న గుంపు నుంచి ఆయన్ని రక్షించలేకపోయాయి. కుటుంబ సభ్యుల ముందు తనను కొట్టొద్దని ఆయన వేడుకున్నా ఫలితం దక్కలేదు.

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన వీడియో చూడండి..

వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని సదరు పోలీసును రక్షించారు.

ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.

కానిస్టేబుల్​ని పొడిచి చంపేశారు..!

దిల్లీలో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది! మద్యం తాగి నడుపుతున్నారన్న కారణంతో ఓ కానిస్టేబుల్​ ఓ వాహనాన్ని అడ్డుకున్నాడు. ఆ బండి మీద ఉన్న ముగ్గురు.. కోపంతో, కానిస్టేబుల్​ని చంపేశారు!

ఆగ్నేయ దిల్లీలోని గోవింద్​పూరిలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసు కానిస్టేబుల్​ని శనివారం తెల్లవారుజామున ముగ్గురు వ్యక్తులు పదునైన ఆయుధంతో పొడిచి చంపారు.

మృతుడు కిరణ్​పాల్ సింగ్ (28) గోవింద్​పురి పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్నాడు. నిందితుల్లో దీపక్ సింగ్ అలియాస్ మ్యాక్స్ (20), క్రిష్ గుప్తా (18)లను అరెస్టు చేశామని, మూడో నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. అతని మొదటి పేరు రాఘవ్ అలియాస్ రాకీ అని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.