Ram Navami at Ayodhya temple: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం వేలాది మంది భక్తులు అయోధ్య రామాలయానికి పోటెత్తారు. అయోధ్యలోని రామాలయంలో 500 సంవత్సరాల తరువాత ఘనంగా శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్నాయి. రామనవమి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు దేశ శుభాకాంక్షలు తెలిపారు. అయోధ్య (Ayodhya) లో రామ నవమి వేడుకలు జరుగుతుండడంతో మొత్తం అయోధ్య సాటిలేని ఆనందంలో ఉందని వ్యాఖ్యానించారు. రామ మందిర ప్రతిష్ఠ తర్వాత అక్కడ శ్రీరామ నవమి పండుగ జరుపుకోవడం ఇదే మొదటిసారి అని గుర్తు చేశారు. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు.
దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామ్ లల్లా సూర్యాభిషేకం బుధవారం మధ్యాహ్నం 12:15 గంటలకు జరగనుంది. ఈ కార్యక్రమం నాలుగు నిమిషాల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో సూర్యకిరణాలు రామ్ లల్లా నుదుటిపై 'తిలకం'ను ఏర్పరుస్తాయి.