MPs suspended : ఒకేసారి 30మంది ఎంపీలను సస్పెండ్​ చేసిన లోక్​సభ స్పీకర్​..!-lok sabha speaker suspends 31 opposition mps for remainder of winter session ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mps Suspended : ఒకేసారి 30మంది ఎంపీలను సస్పెండ్​ చేసిన లోక్​సభ స్పీకర్​..!

MPs suspended : ఒకేసారి 30మంది ఎంపీలను సస్పెండ్​ చేసిన లోక్​సభ స్పీకర్​..!

Sharath Chitturi HT Telugu
Dec 18, 2023 05:11 PM IST

MPs suspended from Lok Sabha : లోక్​సభలో 30మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్​ వేటు పడింది! ఈ మేరకు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభలో 45మంది ఎంపీలపై వేటు పడింది!

31మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్​ వేటు
31మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్​ వేటు (PTI)

MPs suspended from Lok Sabha : పార్లమెంట్​ శీతాకాల సమావేశాల్లో మరో కీలక పరిణామాం! 30మంది ఎంపీలను సస్పెండ్​ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా. గత వారం జరిగిన పార్లమెంట్​ భద్రతా వైఫల్యం నేపథ్యంలో.. విపక్షానికి చెందిన ఎంపీలు.. స్పీకర్​ ఛాంబర్​ వద్ద నిరసనకు దిగడంతో ఓం బిర్లా ఈ నిర్ణయం తీసుకున్నారు.

నిరసనలు చేశారని..!

పార్లమెంట్​లో భద్రతా వైఫల్యంపై లోక్​సభ అట్టుడుకుతోంది. సభ కార్యకలాపాలు సజావుగా సాగడం లేదు. విపక్షాల నిరసనలతో వాయిదాల మీద వాయిదా పడుతోంది. ఈ నేపథ్యంలోనే.. గత వారమే 13మంది విపక్షా ఎంపీలపై సస్పెన్ష్​ వేటు పడింది. తాజాగా.. ఈ జాబితాలోకి మరో 30మంది ఎంపీలు చేరారు. మరో ముగ్గురిపై కూడా సస్పెన్షన్​ వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా.. వారిపైనా ఇదే తరహా చర్యలు తీసుకుంటే.. సస్పెన్షన్​ వేటుకు గురైన ఎంపీల సంఖ్య 46కి చేరుతుంది!

Lok Sabha MP's suspended : తాజాగా సస్పెండ్​ అయిన వారిలో కాంగ్రెస్​ లోక్​సభా పక్ష నేత అధీర్​ రంజన్​ చౌదరితో పాటు గౌరవ్​ గొగోయ్​, టీఎంసీ ఎంపీలు కళ్యాణ్​ బెనర్జీ, కకోలి ఘోష్​, సౌగతా రాయ్​, శతాబ్ది రాయ్​, డీఎంకే ఎంపీ ఏ రాజా, దయానథి మారన్​లు కూడా ఉన్నారు.

లోక్​సభలో ఎంపీల సస్పెన్షన్​ గురించి మీడియాతో మాట్లాడారు అధీర్​ రంజన్​. కేంద్రం.. ఒక నియంతగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్​ని బీజేపీ హెడ్​క్వార్టర్స్​గా భావిస్తోందని ఎద్దేవా చేశారు. శీతాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి.. ప్రభుత్వానికి విపక్షం పూర్తిగా సహకరిస్తోందని ఆయన అన్నారు.

Lok Sabha MP's suspension : "పార్లమెంట్​లో భద్రతా వైఫల్యం గురించి ప్రధాని గారు న్యూ మీడియాతో మాట్లాడారు. హోం మంత్రి గారు టీవీ ఛానెల్స్​తో మాట్లాడతారు. కానీ ఒక్కరు కూడా పార్లమెంట్​లో మాట్లాడట్లేదు ఎందుకు? ఈ షాకింగ్​ ఘటనపై విపక్ష ఇండియా బృందం వేసిన ప్రశ్నలకు వారెందుకు సమాధానాలివ్వడం లేదు?" అని నిలదీశారు అధీర్​ రంజన్​.

గత బుధవారం నాడు.. కొందరు లోక్​సభలోకి స్మోక్​ క్యాన్​లతో ప్రవేశించి గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను తీసుకుని విపక్షాలు పార్లమెంట్​లో నిరసనలు చేస్తున్నాయి.

రాజ్యసభలో కూడా..!

లోక్​సభలో 30మంది ఎంపీల సస్పెన్షన్​ వార్త బయటకు వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే రాజ్యసభలో కూడా ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఎగువ సభలో 45మంది విపక్ష ఎంపీలు సస్పెన్షన్​కి గురైనట్టు తెలుస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం