IRCTC Kerala Tour Package : సమ్మర్ లో కూల్ గా కేరళ(Kerala Tour)లో ఓ టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ కోసమే ఐఆర్సీటీసీ(IRCTC Tour Package) రైలు టూర్ ప్యాకేజీ అందిస్తోంది. బెంగళూరు(Bengaluru) నుంచి 6 రోజుల పాటు కేరళలోని మున్నార్(Munnar), కొచ్చి(Kochi), అతిరాపల్లి(Athirapally) రైల్ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. కేరళ(Kerala) అంటే మనకు గుర్తొచ్చేవి బ్యాక్ వాటర్స్, బీచ్లు, ప్రశాంతమైన పల్లెలు, ప్రకృతి సౌందర్యం. కేరళను దేవుని సొంత దేశం అని కూడా పిలుస్తుంటారు. ప్రశాంతతకు మారుపేరుగా ఉంటే కేరళ పర్యాటక ప్రదేశాలకు(Kerala Tourist Places) ఫేమస్. సమ్మర్ సెలవుల్లో తప్పకుండా మీరు చూడాల్సిన ప్రదేశాల్లో కేరళ ఒకటి. ఈ పర్యటన ఎర్నాకుళం, మున్నార్ (2 నైట్స్), కొచ్చి(1 నైట్), అతిరాపల్లి, త్రిస్సూర్- మొత్తం ఐదు రాత్రులు/ఆరు రోజుల్లో సాగుతోంది.
ప్రతి గురువారం బెంగళూరు నుంచి ప్రత్యేక రైలు ఈ టూర్ కు బయలుదేరుతుంది. ఈ రైలులో బెర్త్ల సంఖ్య స్లీపర్ క్లాస్ - 06 (స్టాండర్డ్), 3ఏసీ క్లాస్- 6 (కంఫర్ట్).
క్లాస్ | సింగిల్ షేరింగ్ | డబుల్ షేరింగ్ | ట్రిపుల్ షేరింగ్ | చైల్డ్ విత్ బెడ్(5-11 years) | చైల్డ్ విత్ అవుట్ బెడ్(5-11 years) |
కంఫర్ట్ | రూ.35450 | రూ.19480 | రూ.16020 | రూ.13360 | రూ.10570 |
స్టాండర్డ్ | రూ.33240 | రూ.17280 | రూ.13810 | రూ.11150 | రూ.8370 |
విజయవాడ, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు విమాన సర్వీసుల కోసం క్లిక్ చేయండి
సంబంధిత కథనం