Summer Special Trains : తెలుగు రాష్ట్రాల మధ్య 48 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్, జాబితా ఇదే!-secunderabad scr running 48 summer special trains between telugu states ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Summer Special Trains : తెలుగు రాష్ట్రాల మధ్య 48 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్, జాబితా ఇదే!

Summer Special Trains : తెలుగు రాష్ట్రాల మధ్య 48 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్, జాబితా ఇదే!

Apr 08, 2024, 09:35 PM IST Bandaru Satyaprasad
Apr 08, 2024, 09:35 PM , IST

  • Summer Special Trains : వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 48 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది.

వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 48 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. 

(1 / 8)

వేసవి రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 48 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. 

సికింద్రాబాద్‌-నాగర్‌సోల్‌, నాగర్‌సోల్‌-సికింద్రాబాద్‌, తిరుపతి-మచిలీపట్నం, మచిలీపట్నం-తిరుపతి, సీఎస్టీ ముంబయి-కరీంనగర్‌, కరీంనగర్‌- సీఎస్టీ ముంబయి, యశ్వంత్‌పూర్‌-కాలాబుర్గి, కాలాబుర్గి-యశ్వంత్ పూ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.  

(2 / 8)

సికింద్రాబాద్‌-నాగర్‌సోల్‌, నాగర్‌సోల్‌-సికింద్రాబాద్‌, తిరుపతి-మచిలీపట్నం, మచిలీపట్నం-తిరుపతి, సీఎస్టీ ముంబయి-కరీంనగర్‌, కరీంనగర్‌- సీఎస్టీ ముంబయి, యశ్వంత్‌పూర్‌-కాలాబుర్గి, కాలాబుర్గి-యశ్వంత్ పూ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.  

సికింద్రాబాద్‌-నాగర్‌సోల్‌ ( రైలు నెం.07517) ప్రత్యేక రైలు ఏప్రిల్‌ 17 నుంచి మే 29 వరకు ప్రతీ బుధవారం అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నాగర్‌సోల్‌-సికింద్రాబాద్‌ (రైలు నెం.07518) స్పెషల్ ట్రైన్  ఏప్రిల్‌ 18 నుంచి మే 30 వరకు ప్రతీ గురువారం నడపనున్నారు.  

(3 / 8)

సికింద్రాబాద్‌-నాగర్‌సోల్‌ ( రైలు నెం.07517) ప్రత్యేక రైలు ఏప్రిల్‌ 17 నుంచి మే 29 వరకు ప్రతీ బుధవారం అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. నాగర్‌సోల్‌-సికింద్రాబాద్‌ (రైలు నెం.07518) స్పెషల్ ట్రైన్  ఏప్రిల్‌ 18 నుంచి మే 30 వరకు ప్రతీ గురువారం నడపనున్నారు.  

తిరుపతి-మచిలీపట్నం మధ్య (రైలు నెం.07121) ప్రత్యేక రైలు ఏప్రిల్ 14 నుంచి మే 26 వరకు ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది. మచిలీపట్నం-తిరుపతి (రైలు నెం.07122) ప్రత్యేక రైలు ప్రతీ సోమవారం ఏప్రిల్ 15 నుంచి మే 27 వరకు నడపనున్నారు.  

(4 / 8)

తిరుపతి-మచిలీపట్నం మధ్య (రైలు నెం.07121) ప్రత్యేక రైలు ఏప్రిల్ 14 నుంచి మే 26 వరకు ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది. మచిలీపట్నం-తిరుపతి (రైలు నెం.07122) ప్రత్యేక రైలు ప్రతీ సోమవారం ఏప్రిల్ 15 నుంచి మే 27 వరకు నడపనున్నారు.  

సీఎస్టీ ముంబయి-కరీంనగర్‌ మధ్య ప్రత్యేక రైలు(01067) ఏప్రిల్ 9 నుంచి మే 28 వరకు ప్రతీ మంగళవారం అందుబాటులో ఉంటుంది. కరీంనగర్‌-సీఎస్టీ ముంబయి మధ్య ప్రత్యేక రైలు(01068)  ఏప్రిల్ 10 నుంచి మే 29 వరకు నడపనున్నారు. యశ్వంత్‌పూర్‌-కాలాబుర్గి ప్రత్యేక రైలు(నెం.06505) ఏప్రిల్ 8వ తేదీన, కాలాబుర్గి-యశ్వంత్‌పూర్‌ ప్రత్యేక రైలు(06506) ఏప్రిల్ 9న నడవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 

(5 / 8)

సీఎస్టీ ముంబయి-కరీంనగర్‌ మధ్య ప్రత్యేక రైలు(01067) ఏప్రిల్ 9 నుంచి మే 28 వరకు ప్రతీ మంగళవారం అందుబాటులో ఉంటుంది. కరీంనగర్‌-సీఎస్టీ ముంబయి మధ్య ప్రత్యేక రైలు(01068)  ఏప్రిల్ 10 నుంచి మే 29 వరకు నడపనున్నారు. యశ్వంత్‌పూర్‌-కాలాబుర్గి ప్రత్యేక రైలు(నెం.06505) ఏప్రిల్ 8వ తేదీన, కాలాబుర్గి-యశ్వంత్‌పూర్‌ ప్రత్యేక రైలు(06506) ఏప్రిల్ 9న నడవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 

అదనపు రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్-రామనాథపురం-సికింద్రాబాద్ స్పెషల్ రైలు (నెం. 07695/07696) పొడిగిస్తున్నట్లు తెలియజేసింది.

(6 / 8)

అదనపు రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్-రామనాథపురం-సికింద్రాబాద్ స్పెషల్ రైలు (నెం. 07695/07696) పొడిగిస్తున్నట్లు తెలియజేసింది.

విజయవాడ-హుబ్లీ-విజయవాడ(07001/07002) మధ్య ఉగాది స్పెషల్ ట్రైన్స్ ఈ నెల 10, 11 తేదీల్లో నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.      

(7 / 8)

విజయవాడ-హుబ్లీ-విజయవాడ(07001/07002) మధ్య ఉగాది స్పెషల్ ట్రైన్స్ ఈ నెల 10, 11 తేదీల్లో నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.      

ఈ నెల 9న పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు. హైదారాబాద్-లింగంపల్లి(47125), లింగంపల్లి-సికింద్రాబాద్(47193), ఫలక్ నుమా-లింగంపల్లి(47167), లింగంపల్లి-ఉమ్దానగర్(47194), లింగంపల్లి-సికింద్రాబాద్(47195) రైళ్లను రద్దు చేశారు.  ఉమ్దానగర్-లింగపల్లి(47103) ఎంఎంటీఎస్ సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య రద్దు చేశారు. 

(8 / 8)

ఈ నెల 9న పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేశారు. హైదారాబాద్-లింగంపల్లి(47125), లింగంపల్లి-సికింద్రాబాద్(47193), ఫలక్ నుమా-లింగంపల్లి(47167), లింగంపల్లి-ఉమ్దానగర్(47194), లింగంపల్లి-సికింద్రాబాద్(47195) రైళ్లను రద్దు చేశారు.  ఉమ్దానగర్-లింగపల్లి(47103) ఎంఎంటీఎస్ సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య రద్దు చేశారు. 

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు