Jammu and Kashmir news: జమ్మూకశ్మీర్ లో బస్సు లోయలో పడి 21 మంది మృతి, 40 మందికి గాయాలు-jammu and kashmir news 21 killed as bus carrying pilgrims falls into gorge ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jammu And Kashmir News: జమ్మూకశ్మీర్ లో బస్సు లోయలో పడి 21 మంది మృతి, 40 మందికి గాయాలు

Jammu and Kashmir news: జమ్మూకశ్మీర్ లో బస్సు లోయలో పడి 21 మంది మృతి, 40 మందికి గాయాలు

HT Telugu Desk HT Telugu

Jammu and Kashmir news: జమ్మూకశ్మీర్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హరియాణా లోని కురుక్షేత్ర నుంచి యాత్రికులతో వెళ్తున్న బస్సు జమ్మూలోని అఖ్నూర్ జిల్లాలో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న 150 అడుగుల లోతు ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 21 మంది చనిపోయారు. 40 మందికి గాయాలయ్యాయి.

మ్మూకశ్మీర్ లో లోయలో పడిన బస్సు (PTI)

Jammu and Kashmir bus accident: జమ్మూకశ్మీర్ లో యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో 21 మంది మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. జమ్మూలోని అఖ్నూర్ జిల్లాలో ఉన్న చోకి చోరా బెల్ట్ లోని టాంగ్లీ మోర్హ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సు సుమారు 150 అడుగుల లోతు లోయలో పడిపోయింది.

ఎల్జీ సంతాపం

జమ్మూలోని అఖ్నూర్ లో జరిగిన బస్సు ప్రమాదం హృదయాన్ని కలచివేసిందని, మృతులకు సంతాపం తెలుపుతున్నానని జమ్మూకశ్మీర్ ఎల్జీ గురువారం మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్ లో సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు.

కురుక్షేత్ర నుంచి..

ప్రమాదానికి గురైన బస్సులో హర్యానాలోని కురుక్షేత్ర ప్రాంతం నుంచి జమ్ముకశ్మీర్ లోని రియాసి జిల్లాలోని శివ్ ఖోరి ప్రాంతానికి యాత్రికులు వెళ్తున్నారు. రాజౌరీ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం తెలియగానే పోలీసులు, స్థానిక అధికారులు అక్కడికి చేరుకుని, స్థానికుల సహాయంతో సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను జమ్మూలోని అఖ్నూర్ ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు.

జమ్ముకశ్మీర్ యాత్ర

రాబోయే అమర్ నాథ్ యాత్ర నేపథ్యంలో.. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ సజావుగా సాగేలా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి వెంబడి అత్యవసర మరమ్మతుల కోసం కనీసం 17 సున్నితమైన ప్రాంతాలను గుర్తించినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కశ్మీర్ ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే ఏకైక రహదారి అయిన 270 కిలోమీటర్ల జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మంగళవారం ఉన్నతస్థాయి అధికారుల బృందం పరిశీలించింది. దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని 3,880 మీటర్ల ఎత్తైన అమర్ నాథ్ గుహాలయానికి 52 రోజుల వార్షిక యాత్ర జూన్ 29న ప్రారంభమై ఆగస్టు 19న ముగియనుంది.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.