AAP in Karnataka elections : కర్ణాటక ఎన్నికల బరిలో ఆప్​.. అన్ని సీట్లల్లో పోటీ!-eyeing electoral foothold aap to field candidates in all 224 seats in karnataka assembly polls ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Eyeing Electoral Foothold, Aap To Field Candidates In All 224 Seats In Karnataka Assembly Polls

AAP in Karnataka elections : కర్ణాటక ఎన్నికల బరిలో ఆప్​.. అన్ని సీట్లల్లో పోటీ!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Oct 30, 2022 02:37 PM IST

AAP in Karnataka elections : 2023 కర్ణాటక ఎన్నికలపై కన్నేసింది ఆమ్​ ఆద్మీ పార్టీ. మొత్తం 224 సీట్లల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించింది.

కర్ణాటక ఎన్నికల బరిలో ఆప్​.. అన్ని సీట్లల్లో పోటీ!
కర్ణాటక ఎన్నికల బరిలో ఆప్​.. అన్ని సీట్లల్లో పోటీ! (Sanjay Sharma/file)

AAP in Karnataka elections : పంజాబ్​ ఎన్నికల గెలుపుతో జాతీయ రాజకీయాలపై కన్నేసిన ఆమ్​ ఆద్మీ పార్టీ జోరు పెంచింది. ఓవైపు గుజరాత్​, హిమాచల్​ ప్రదేశ్​ ఎన్నికల కోసం తీవ్రస్థాయిలో ప్రచారాలు చేస్తూనే.. మరోవైపు రానున్న కర్ణాటక ఎన్నికలపైనా పక్కాగా ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో.. రానున్న కర్ణాటక ఎన్నికల్లో మొత్తం 224 సీట్లల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది ఆప్​.

ట్రెండింగ్ వార్తలు

అభ్యర్థుల జాబితా కూడా రెడీ..!

2023 మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల హడావుడి మొదలైంది. ఇందుకు తగ్గట్టుగానే ఆప్​ కూడా తన అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే.. సగానిపైగా అభ్యర్థుల జాబితాను ఆప్​ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. 2023 జనవరి మొదటి వారంలోనే ఈ జాబితాను ప్రకటించి, ఇతర పార్టీలను ఆశ్చర్యానికి గురిచేయాలని చూస్తోంది అరవింద్​ కేజ్రీవాల్​ బృందం. మిగిలిన అభ్యర్థుల జాబితాను ఎన్నికలకు ముందు ప్రకటించే విధంగా కసరత్తులు చేస్తోంది.

2023 Karnataka Assembly elections : 224 స్థానాల్లో ఆప్​ పోటీ చేస్తుందని.. కర్ణాటక ఆప్​ కన్వీనర్​ పృథ్వి రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వంలోని అవినీతిని వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి వెళతామని స్పష్టం చేశారు.

"మొత్తం 224 సీట్లల్లో పోటీ చేయాలని మేము నిర్ణయించుకున్నాము. 170కిపైగా నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారాలు మొదలుపెట్టేశాము. గ్రామ్​ సంపర్క్​ అభియాన్​ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. బూత్​ లెవెల్​లో ఆప్​ సభ్యులను కేటాయించే పనిలో ఉన్నాము," అని పృథ్వి రెడ్డి స్పష్టం చేశారు.

Karnataka AAP : "బూత్​ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తేనే అవినీతి, అధికార దుర్వినియోగంపై పోరాడగలము అని మేము అనుకుంటున్నాము. అందుకే రాష్ట్రంలోని ప్రతి బూత్​కు కనీసం 10మంది కార్యకర్తలను కేటాయిస్తాము. ప్రజల సమస్యలను వారు లేవనెత్తుతారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై ప్రజలు విసుగెత్తిపోయారు. అందుకే ఆప్​కు కర్ణాటకలో ఆదరణ లభిస్తోంది," అని పృథ్వి రెడ్డి వెల్లడించారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్​, జేడీఎస్​లు.. ప్రజల సమస్యలను తీర్చడంలో విఫలమయ్యాయని పృథ్వి రెడ్డి ఆరోపించారు. గెలవడం కోసమే తాము ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో సత్తా చాటుతామని పేర్కొన్నారు.

Karnataka Assembly elections : గుజరాత్​, హిమాచల్​ ప్రదేశ్​ ఎన్నికల ఫలితాల్లో ఆప్​ మెరుగ్గా రాణిస్తే.. కర్ణాటకలోనూ మరింత జోరు పెంచే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంట గెలిస్తే.. ఆప్​నకు, అరవింద్​ కేజ్రీవాల్​కు ప్రాముఖ్యత విపరీతంగా పెరుగుతుంది. ఇది కర్ణాటక ఎన్నికలపైనా ప్రభావం చూపిస్తుందని అనడంలో సందేహం లేదు!

WhatsApp channel

సంబంధిత కథనం