Ashok Gehlot vs Sachin Pilot : గహ్లోత్​- పైలట్​ మళ్లీ డిష్యూం డిష్యూం.. కాంగ్రెస్​కు తలనొప్పి!-ashok gehlot vs sachin pilot rajasthan cm lashes out on his rival says sachin pilot in gaddar ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Ashok Gehlot Vs Sachin Pilot Rajasthan Cm Lashes Out On His Rival, Says 'Sachin Pilot In Gaddar'

Ashok Gehlot vs Sachin Pilot : గహ్లోత్​- పైలట్​ మళ్లీ డిష్యూం డిష్యూం.. కాంగ్రెస్​కు తలనొప్పి!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 25, 2022 07:40 AM IST

Ashok Gehlot vs Sachin Pilot : సచిన్​ పైలట్​పై మరోమారు విరుచుకుపడ్డారు అశోక్​ గహ్లోత్​. ఆయన ఆరోపణలను సచిన్​ పైలట్​ తిప్పికొట్టారు.

సచిన్​ పైలట్​.. అశోక్​ అగహ్లోత్​
సచిన్​ పైలట్​.. అశోక్​ అగహ్లోత్​ (HT_PRINT/file)

Ashok Gehlot vs Sachin Pilot : రాజస్థాన్​ కాంగ్రెస్​లో అంతర్గత యుద్ధం మళ్లీ తెరపైకి వచ్చింది. పార్టీలో సంక్షోభానికి కారణమైన సీఎం అశోక్​ గహ్లోత్​, మాజీ డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్​ల మధ్య మరోమారు మాటల యుద్ధం మొదలైంది. 'సచిన్​.. పార్టీకి ద్రోహం చేశారు' అంటూ అశోక్​ గహ్లోత్​ మండిపడగా.. వాటిని ఆయన తిప్పికొట్టారు. ఫలితంగా.. వీరిద్దరి వ్యవహారం కాంగ్రెస్​కు మళ్లీ తలనొప్పి తెచ్చిపెట్టే విధంగా ఉంది!

ట్రెండింగ్ వార్తలు

టైమింగ్​ చూసుకుని..?

కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ.. ప్రస్తుతం భారత్​ జోడో యాత్రలో ఉన్నారు. మధ్యప్రదేశ్​ బుర్హన్​పూర్​లో జరిగిన యాత్రలో ఆయన సోదరి ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు. వీరితో పాటు సచిన్​ పైలట్​ సైతం కలిసి నడిచారు. ఓవైపు.. సచిన్​ పైలట్​ పాద యాత్రలో ఉండగా.. మరోవైపు ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు అశోక్​ గహ్లోత్​. సచిన్​పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

"పార్టీకి ద్రోహం చేసిన ఓ వ్యక్తి.. రాష్ట్రానికి సీఎం కాలేడు. పైలట్​ను హైకమాండ్​ సీఎంను చేయలేదు. ఆయన వద్ద కనీసం 10మంది ఎమ్మెల్యేలు కూడా లేరు. పార్టీపై తిరుగుబాటు చేసిన వ్యక్తి సచిన్​ పైలట్​. ఓ పార్టీ అధ్యక్షుడు.. సొంత ప్రభుత్వాన్నే కుప్పకూల్చేందుకు ప్రయత్నించడం.. బహుశా చరిత్రలో ఇదే తొలిసారి. బీజేపీ ఫండింగ్​తోనే ఆయన తిరుగుబాటు చేశారు," అని ఆరోపించారు అశోక్​ గహ్లోత్​.

Ashok Gehlot latest news : అశోక్​ గహ్లోత్​పై యుద్ధం, హైకమాండ్​పై అసంతృప్తితో.. 2020లో కాంగ్రెస్​పై తిరుగుబాటు చేశారు సచిన్​ పైలట్​. 2018 ఎన్నికల అనంతరం జరిగిన ఒప్పందం ప్రకారం.. గహ్లోత్​తో సచిన్​ పైలట్​ సీఎం సీటుని పంచుకోవాల్సి ఉంది. కానీ అలా జరగకపోవడంతో ఆయన తిరుగుబాటు చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని వేరే రాష్ట్రంలోని హోటల్​కు షిఫ్ట్​ అయ్యారు. ఈ వ్యవహారం కొన్ని రోజులు.. రాజస్థాన్​ రాజకీయాలను వేడెక్కించింది. రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ బుజ్జగింపుతో.. తిరిగి రాజస్థాన్​కు వెళ్లిపోయారు ఈ యువ కాంగ్రెస్​ నేత.

అయితే.. సీఎం సీటును పంచుకునే విషయంపై ఎలాంటి ఒప్పందం జరగలేదని అశోక్​ గహ్లోత్​ పునురుద్ఘాటించారు.

"అసలు ఆ ప్రశ్నే లేదు. సీఎం కుర్చీని పంచుకునే విషయంపై ఎప్పుడు చర్చలే జరగలేదు. సచిన్​ పైలట్​ ఇంకా దానినే పట్టుకుంటే.. మీరే(మీడియా) వెళ్లి రాహుల్​ గాంధీని అడగండి. ఆయన నిజం చెబుతారు," అని రాజస్థాన్​ సీఎం అన్నారు.

'ఇది చాలా తప్పు..'

Sachin Pilot vs Ashok Gehlot : అశోక్​ గహ్లోత్​ ఆరోపణలను సచిన్​ పైలట్​ తిప్పికొట్టారు.

"అశోక్​ గహ్లోత్​ లాంటి సీనియర్​ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఎంతో అనుభవం ఉన్న ఆయన.. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తుకు పోసుకునే సమయం కాదు ఇది. బీజేపీపై పోరాటంలో అందలు కలిసిగట్టుగా పనిచేయాలి. మనం కలిసిగట్టు ఉండి గుజరాత్​లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయం ఇది. కలిసిగట్టుగా ఉండి రాజస్థాన్​లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే సమయం ఇది," అని సచిన్​ పైలట్​ అభిప్రాయపడ్డారు.

Rajasthan Congress war : దేశంలో.. కాంగ్రెస్​ అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో ఒకటి రాజస్థాన్​. ఇంకోటి ఛత్తీస్​గఢ్​. వచ్చే ఏడాది.. రాజస్థాన్​లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో అశోక్​ గహ్లోత్​, సచిన్​ పైలట్​లు మళ్లీ యుద్ధం దిశగా అడుగులు వేస్తుండటం.. పార్టీ హైకమాండ్​కు కచ్చితంగా తలనొప్పి తెచ్చిపెట్టే విషయమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం