రేపు JEE Advanced పరీక్ష.. అభ్యర్థులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!
JEE Advanced 2022: ఐఐటీల్లో ప్రవేశాలకు సంబంధించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2022 పరీక్ష ఆగస్టు 28 జరగనుంది. రెండు షిఫ్టుల్లో నిర్వహించబడుతుంది. మొదటి పేపర్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో పేపర్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఉంటుంది.
IIT ప్రవేశాలకు సంబంధించిన JEE అడ్వాన్స్డ్ 2022 ప్రవేశ పరీక్ష రేపు దేశవ్యాప్తంగా జరగనుంది. పరీక్ష రెండు షిఫ్టుల్లో నిర్వహించబడుతుంది. మొదటి పేపర్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో పేపర్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ కూడా ఉండనుంది. కాబట్టి ఖచ్చితమైన సమాధానాలు ఇవ్వండి. పరీక్షకు సంబంధించిన మరిన్ని అప్డేట్లు లేదా ఇతర సమాచారం కోసం, కమిషన్ అధికారిక వెబ్సైట్ jeeadv.ac.inని సందర్శించండి.
JEE అడ్వాన్స్డ్ 2022 తాత్కాలిక ఆన్సర్ కీ సెప్టెంబర్ 03న విడుదల చేయబడుతుంది. JEE అడ్వాన్స్డ్ ఫలితాలతో పాటు JEE అడ్వాన్స్డ్ ఫైనల్ ఆన్సర్ కీ సెప్టెంబర్ 11న విడుదల చేయబడుతుంది. JEE అడ్వాన్స్డ్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు IITలలో UG కోర్సులైన ఇంజనీరింగ్, సైన్స్ లేదా ఆర్కిటెక్చర్లో గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులు, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ ప్రోగ్రామ్లు లేదా గ్రాడ్యుయేట్-మాస్టర్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్లలో ప్రవేశాలు ఉంటాయి.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బాంబే IIT JEE అడ్వాన్స్డ్ 2022 అడ్మిట్ కార్డ్ను గతంలో జారీ చేసింది . అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ jeeadv.ac.in నుండి అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోగలరు.
పరీక్ష కేంద్రానికి వెళ్ళే మందు గుర్తించుకోవాల్సిన విషయాలు
అభ్యర్థులు తమ వెంట తమ అడ్మిట్ కార్డు, ఫోటో ID కార్డ్ తీసుకురావాలి.
దయచేసి అడ్మిట్ కార్డ్పై తెలిపిన మార్గదర్శకాలను చదవండి.
- పరీక్ష రాసేందుకు బాల్ పాయింట్ పెన్ను, పెన్సిల్ తీసుకెళ్లాలి.
- ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతించబడవు.
మొబైల్ ఫోన్లు, బ్లూటూత్, మైక్రోఫోన్, కాలిక్యులేటర్, వాచ్లను పరీక్ష హాల్కు అనుమతించారు.
తినుబండారాలు కూడా పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లేందుకు అనుమతి లేదు.
అభ్యర్థులు తమ వెంట వాటర్ బాటిల్ తీసుకెళ్లవచ్చు.
- 50 ml బాటిల్ హ్యాండ్ శానిటైజర్ని తీసుకెళ్లవచ్చు.
పరీక్ష ప్రారంభమైన తర్వాత ఎవరినీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
సంబంధిత కథనం