టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ వరుసగా తమ ఉత్పత్తులపై తగ్గింపును ప్రకటిస్తోంది. తాజాగా Galaxy Tab A7 Lite టాబ్లెట్ ఫోన్ ధరను తగ్గించింది. ఇటీవల కాలంలో శాంసంగ్ Watch 4, గెలాక్సీ A13, గెలాక్సీ A22 5G వంటి స్మార్ట్ఫోన్ల ధరలను తగ్గించింది. కొత్త ప్రొడక్ట్స్ విడుదల చేస్తున్న సందర్భంలో ఈ విధమైన తగ్గింపులు ప్రకటిస్తూ శాంసంగ్ కంపెనీ తమ సేల్స్ పెంచుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Samsung Galaxy Tab A7 Lite టాబ్లెట్ భారత మార్కెట్లో LTE అలాగే Wi-Fi అనే రెండు వేరియంట్లలో విడుదల చేసింది. 4G LTE పాత ధర రూ.14,999 ఉండగా దీని ధరను రూ. 1000 తగ్గించి ఇప్పుడు రూ, 13,999కి అందిస్తుండగా.. Wi-Fi వేరియంట్ పాత ధర రూ.11,999 కాగా, దీనిపై కూడా ఆండ్రాయిడ్ టాబ్లెట్ ధర రూ. 1,000 తగ్గి ఇప్పుడు రూ. 11 వేలకు లభ్యమవుతోంది. అదనంగా SBI క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు శాంసంగ్ రూ. 2,000 ఇన్స్టంట్ క్యాష్బ్యాక్ కూడా అందిస్తోంది. కేవలం నెలకు రూ. 998 చెల్లించి నో కాస్ట్ EMI ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రకారం Samsung Galaxy Tab A7 Liteను కేవలం రూ. 9 వేలకే సొంతం చేసుకోవచ్చు.
మరి ఈ టాబ్లెట్లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ఈ టాబ్లెట్ సిల్వర్, గ్రే, అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
సంబంధిత కథనం