Unstoppable 2 Latest Promo: అన్‌స్టాపబుల్ షోలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై బాలయ్య షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?-balakrishna shocking comments on ys rajasekhara reddy in unstoppable 2 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Balakrishna Shocking Comments On Ys Rajasekhara Reddy In Unstoppable 2

Unstoppable 2 Latest Promo: అన్‌స్టాపబుల్ షోలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై బాలయ్య షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

Maragani Govardhan HT Telugu
Nov 17, 2022 08:39 PM IST

Unstoppable 2 Latest Promo: అన్‌స్టాపబుల్ షోలో నందమూరి బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అతిథిగా వచ్చిన ఆ షోలో ఆయనతో కలిసి బాలయ్య సందడి చేశారు.

అన్‌స్టాపబుల్ 2 లేటెస్ట్ ప్రోమో రిలీజ్
అన్‌స్టాపబుల్ 2 లేటెస్ట్ ప్రోమో రిలీజ్

Unstoppable 2 Latest Promo: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో ఎంత పెద్ద సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుత అన్‌స్టాపబుల్ సీజన్ 2 నడుస్తోంది. అయితే ఇప్పటికే తెదేపా అధినేత చంద్రబాబు, హీరోలు విశ్వక్ సేన్, సిద్ధార్థ్ జొన్నలగడ్డ, అడివిశేష్, శర్వానంద్ పాల్గొని సందడి చేశారు. తాజా ఎపిసోడ్‌లో ఎవ్వరూ ఊహించనటువంటి అతిథులను ఆహ్వానించారు బాలయ్య. వారితో కలిసి ఆయన చేసిన సందడి మాములుగా లేదు. ఇంతకీ వారెవరో కాదు.. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, రాజకీయన నేత సురేష్ రెడ్డితో పాటు అలనాటి హీరోయిన్ రాధికా శరత్ కుమార్ విచ్చేశారు. తాజాగా ఈ షో ప్రోమో విడుదల చేసింది ఆహా.

ప్రోమోను బట్టి చూస్తే స్నేహితులతో ఈ సారి బాలయ్య అల్లరి చేసినట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డితో ఆయన స్నేహం చాలా మందికి తెలిసిందే. ఇద్దరూ కలిసి ఆ రోజుల్లో చేసిన చిలిపి పనులు, తుంటరి చేష్టలను గురించి ఈ షోలో మరోసారి నెమరేసుకున్నారు. ఇంతలో సురేష్ రెడ్డి కూడా వీరికి తోడవుతారు. కిరణ్ కుమార్ రెడ్డి గురించి ప్రస్తావిస్తూ.. ఆయనేమో ఔట్ స్టాండింగ్ క్రికెటర్.. నేనేమో ఔట్ స్టాండింగ్ స్టూడెంట్ అని సురేష్ రెడ్డి చెబుతారు. నేను ఔట్ స్టాండింగ్ స్టూడెంట్‌ను అని ఎందుకన్నానంటే.. ఎప్పుడూ క్లాస్ బయటే ఉండేవాడినని నవ్వులు పూయించారు.

రాజశేఖర్ రెడ్డి గొప్ప పర్సనాలిటీ: బాలకృష్ణ

అమ్మాయిలను పడేయటంలో వీరిద్దరే హీరోలు అంటూ కిరణ్ కుమార్ రెడ్డి.. బాలయ్య, సురేష్ రెడ్డి గురించి చెబుతారు. అనంతరం తాను సీఎం పీటంపై ఎలాంటి సమయంలో కూర్చోవాల్సి వచ్చిందో కూడా వివరించారు. నేను బతికున్నాను కాబట్టే సీఎం అయ్యానని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. అంతటితో ఆగకుండా మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్ రెడ్డి గురించి కూడా ఆసక్తికర విషయాలను తెలియజేస్తారు. ఓ సీనియర్ మినిస్టర్ రాజశేఖర్ రెడ్డి గారిని మిస్ లీడ్ చేసేవారని ఆయన అన్నారు. ఆ సీనియర్ మంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రయాణించే హెలికాప్టర్‌లో రాత్రి 8 గంటలకు అనగానే అంతా సైలెంటైపోతారు. దీంతో ఆయన ఏంచెబుతారో ఉత్కంఠ కలుగుతుంది. అయితే ఈ ప్రోమోలో ఆ విషయం గురించి చూపించలేదు అనంతరం బాలయ్య ప్రతిస్పందిస్తూ.. మనం చాలా గొప్ప నేతలను కోల్పోయామని, అందులో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అలాంటి ఓ గొప్ప పర్సనాలిటీ తెలిపారు.

అనంతరం ఈ ముగ్గురు కలిసి క్రికెట్ ఆడతారు. బాలయ్య బౌలింగ్ చేయగా.. కిరణ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ చేశారు. సురేష్ రెడ్డి ఫీల్డింగ్ బాధ్యతలు తీసుకున్నారు. బౌలింగ్ చేసే ముందు బాలయ్య కసరత్తులు చేయడం ఫన్నీగా అనిపిస్తుంది. వీరు క్రికెట్ ఆడుతుండగా.. ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ ఎంట్రీ ఇస్తుంది. అంపైర్ లేకుండా క్రికెట్ ఎలా ఆడతారని అంటుంది. చిరంజీవి, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రజినీకాంత్ ఇలా అందరి సూపర్‌స్టార్లతోనూ చేశావ్.. నాతో ఎందుకు చేయలేదని రాధికను బాలయ్య ప్రశ్నిస్తారు. అలాగే చిరంజీవిలో నీకు నచ్చనది ఏంటి.. నాలో నచ్చింది ఏంటి అని మరో చిక్కు ప్రశ్న ఆమెకు విసురుతారు బాలకృష్ణ. అంతటితో ప్రోమో ముగుస్తుంది. ఈ పూర్తి ఎపిసోడ్ నవంబరు 25న ఆహాలో విడుదలవుతుంది. అప్పటివరకు వేచి ఉండాల్సిందే.

IPL_Entry_Point

సంబంధిత కథనం