Today Gold Rate September 11th : నేటి బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్, విజయవాడలో ఇలా-today gold and silver price on september 11th 2024 in hyderabad telangana vijayawada andhra pradesh gold rate today ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Today Gold Rate September 11th : నేటి బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్, విజయవాడలో ఇలా

Today Gold Rate September 11th : నేటి బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్, విజయవాడలో ఇలా

Anand Sai HT Telugu

Today Gold and Silver Price : దేశంలో బంగారం ధరలు మరి కాస్త తగ్గాయి. వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్, విజయవాడలాంటి నగరాల్లో ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

నేటి బంగారం ధరలు

దేశంలో బంగారం ధరలు బుధవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 66,760కి చేరింది. మంగళవారం ఈ ధర రూ. 66,770గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 6,67,600గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,676గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 దిగొచ్చి.. రూ. 72,830గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 72,840గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి రూ. 7,28,300గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,283గా ఉంది.

దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు బుధవారం తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,910గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,980గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,760 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,830గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,760గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,830గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,760గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,830గాను ఉంది.

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,760గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,830గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ.66,810గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 72,880గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,760గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,830గా ఉంది.

ఆర్​బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్​ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి ధరలు

దేశంలో వెండి ధరలు బుధవారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,610గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 పెరిగి రూ. 86,100గా కొనసాగుతోంది. మంగళవారం ఈ ధర రూ. 86,000గా ఉండేది.

హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 91,100 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 86,100.. బెంగళూరులో రూ. 84,100గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా

దేశంలో ప్లాటీనం రేట్లు బుధవారం కాస్త పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 220 పెరిగి రూ. 25,370కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 25,150గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,370గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.