HDFC Bank: ‘‘ఆ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కు ఇకపై ఎస్ఎంఎస్ అలర్ట్స్ రావు’’: హెచ్డీఎఫ్సీ బ్యాంక్-hdfc bank to stop sms alerts for these upi payments check details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hdfc Bank: ‘‘ఆ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కు ఇకపై ఎస్ఎంఎస్ అలర్ట్స్ రావు’’: హెచ్డీఎఫ్సీ బ్యాంక్

HDFC Bank: ‘‘ఆ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కు ఇకపై ఎస్ఎంఎస్ అలర్ట్స్ రావు’’: హెచ్డీఎఫ్సీ బ్యాంక్

HT Telugu Desk HT Telugu

యూపీఐ లావాదేవీలకు సంబంధించి హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. ఇకపై రూ. 100 లోపు యూపీఐ చెల్లింపులకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ ను పంపించబోమని స్పష్టం చేసింది. ఈ మెయిల్ ద్వారా నోటిఫికేషన్ పంపించడం కొనసాగిస్తామని, కస్టమర్లు తమ ఈ మెయిల్ ఐడీ లను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది.

రూ. 100 లోపు చెల్లింపులకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఉండవన్న హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్

HDFC Bank: రూ.100 లోపు యూపీఐ చెల్లింపులకు ఎస్ఎంఎస్ అలర్ట్ లను నిలిపివేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది. ఈ మార్పు జూన్ 25 నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ తెలిపింది. హెచ్డీఎఫ్సీ కస్టమర్లు రూ .100 కంటే ఎక్కువ విలువైన లావాదేవీలు లేదా యూపీఐ ద్వారా రూ .500 కంటే ఎక్కువ మొత్తాన్ని అందుకున్నట్లయితే మాత్రమే టెక్స్ట్ నోటిఫికేషన్లను అందుకుంటారని బ్యాంక్ తెలిపింది.

చిన్న మొత్తాల చెల్లింపులు పెరగడంతో..

యూపీఐ లావాదేవీల సగటు విలువ తగ్గుముఖం పట్టడంతో చిన్న మొత్తంలో తరచుగా చెల్లింపులు పెరుగుతున్నాయి. అందువల్ల రూ. 100 చెల్లింపులకు, రూ. 500 లోపు యూపీఐ డిపాజిట్లకు ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఉండబోవని వివరించింది. చిన్న మొత్తాలకు అలర్ట్స్ అవసరం లేదని కస్టమర్ ఫీడ్ బ్యాక్ రావడంతో, ఆ ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. అయితే, అన్ని లావాదేవీలకు ఈ మెయిల్ ద్వారా నోటిఫికేషన్స్ పంపిస్తామని తెలిపింది. అందువల్ల కస్టమర్లు బ్యాంక్ లకు గతంలో ఇచ్చిన తమ ఈ మెయిల్ ఐడీలు యాక్టివ్ గా ఉన్నాయో, లేవో సరి చూసుకోవాలని, తమ ఈ మెయిల్ లను అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పిసిఐ) ప్రకారం, 2023 లో, యుపిఐ లావాదేవీలు 100 బిలియన్ల మార్కును అధిగమించాయి. ఈ సంవత్సరాంతానికి 118 బిలియన్లకు చేరుకుంటాయి.