Gold and Silver prices today : డిసెంబర్​ 22 : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..-gold and silver prices today 22nd december 2024 in telugu states ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : డిసెంబర్​ 22 : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Gold and Silver prices today : డిసెంబర్​ 22 : తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

Sharath Chitturi HT Telugu

Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు తగ్గాయా? పెరిగాయా? డిసెంబర్​ 22న మీ నగరాల్లో నేటి బంగారం, వెండి ధరల వివరాలను ఇక్కడ చెక్​ చేసుకోండి..

మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

దేశంలో బంగారం ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం స్థిరంగా రూ. 77,450గా కొనసాగుతోంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 7,74,500గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,745గా ఉంది.

మరోవైపు 10గ్రాముల బంగారం (22క్యారెట్లు) ధర రూ. 71,000గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 7,10,000గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 7,100గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం పసిడి రేట్లు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని దిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,150గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,600గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,000 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 77,450గా ఉంది. ముంబై, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 71,000గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,450గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 71,000గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 77,600గాను ఉంది.

హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 71,000గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,450గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 71,050గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 77,500గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 71,000గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 77,450గా ఉంది.

ఫెడ్​ వడ్డీ రేట్లు కోతపై అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 9,150గా ఉంది. ఇక కేజీ వెండి రూ. 91,500గా కొనసాగుతోంది. శనివారం కూడా ఇదే ధర పలికింది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 99,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 91,500.. బెంగళూరులో రూ. 91,500గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు ఆదివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 100 పెరిగి రూ. 25,260కి చేరింది. శనివారం ఈ ధర రూ. 25,160గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,260గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం