Andhra Pradesh News Live December 23, 2024: AP Weather Report : ఏపీలో రానున్న మూడు రోజులు వర్షాలు, రేపు ఈ జిల్లాల్లో
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 23 Dec 202405:03 PM IST
AP Weather Report : అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అల్పపీడనం వాయుగుండంగా మారి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమీపంగా రానున్న ఐఎండీ పేర్కొంది.
Mon, 23 Dec 202402:19 PM IST
Kadapa Mla Vs Mayor : కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వ సభ్య సమావేశంలో కుర్చీల ఫైట్ కొనసాగింది. టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ వైసీపీ మేయర్ మధ్య వాగ్వాదం జరిగింది. సభలో టీడీపీ, వైసీపీ కార్పొరేటర్లు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు.
Mon, 23 Dec 202411:45 AM IST
- Pariksha Pe Charcha 2025 : జనవరిలో జరిగే "పరీక్షా పే చర్చా (పీపీసీ)-2025"కు ఉపాధ్యాయులు, విద్యార్థుల రిజిస్ట్రేషన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నోడల్ అధికారుల నామినేషన్లను కూడా స్వీకరిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్ వి.విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు.
Mon, 23 Dec 202410:01 AM IST
- YSRCP : జగన్ జంగ్ సైరన్ మోగించారు. కూటమి ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం ఇచ్చిన వైసీపీ చీఫ్.. ఇకపై ప్రజల పక్షాన ప్రభుత్వంపై పోరాడాలని డిసైడ్ అయ్యారు. అందుకు కరెంట్ ఛార్జీల పెంపు అంశాన్ని అస్త్రంగా వాడుకోవాలని నిర్ణయించారు. కరెంటు ఛార్జీలపై డిసెంబర్ 27న పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు.
Mon, 23 Dec 202409:50 AM IST
APSRTC Temple Tour : ఏపీఎస్ఆర్టీసీ పుణ్యక్షేత్రాలు తిరిగే భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ధనుర్మాసం సందర్భంగా రాజమండ్రి నుంచి "నవజనార్దన పారిజాతాలు" పేరుతో స్పెషల్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాత్రలో ఒకే రోజు 9 పుణ్యక్షేత్రాలు దర్శించుకోవచ్చు.
Mon, 23 Dec 202409:30 AM IST
Dead Body Parcel Case : యండగండి పార్శిల్ డెడ్ బాడీ కేసులో మిస్టరీ వీడింది. ఈ మృతదేహం కాళ్ళ గ్రామానికి చెందిన పర్లయ్యదిగా పోలీసులు గుర్తించారు. పర్లయ్యను శ్రీధర్ వర్మ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆస్తి వివాదాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Mon, 23 Dec 202408:45 AM IST
- Amaravati Capital: అమరావతి నిర్మాణం కోసం చేసే అప్పులపై ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాజధాని నిర్మాణం కొలిక్కి వచ్చిన తర్వాత ప్రభుత్వం వద్ద మిగిలే భూముల్ని విక్రయించడం ద్వారా రుణాలను తీరుస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 26 జిల్లాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Mon, 23 Dec 202408:15 AM IST
- Trains Cancellation: దక్షిణ మధ్య రైల్వే డివిజన్ పరిధిలోని కాజీపేట - విజయవాడ సెక్షన్ల మధ్య మోటమర్రి బ్లాక్లో నాన్ ఇంటర్ లింకింగ్ పనుల కోసం భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేశారు. దాదాపు రెండు వారాల పాటు ఈ మార్గంలో ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించారు.
Mon, 23 Dec 202406:51 AM IST
- YS Jagan to Kadapa: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ క్రిస్మస్ వేడుకల్ని పులివెందులలో జరుపుకోనున్నారు. డిసెంబర్ 24 నుంచి నాలుగు రోజుల పాటు పులివెందులలోనే గడుపుతారు. బెంగుళూరు నుంచి నేరుగా కడప జిల్లాల ఇడుపులపాయకు వెళ్లి వైఎస్సార్ ఘాట్లో నివాళులు అర్పిస్తారు.
Mon, 23 Dec 202406:20 AM IST
- Nara Devansh World Record : నారా లోకేష్ తనయుడు దేవాన్ష్ చెస్లో వేగవంతంగా పావులు కదపడంలో ప్రపంచ రికార్డు సాధించాడు. 9 ఏళ్ల నారా దేవాన్ష్.. వేగవంతమైన చెక్మేట్ సాల్వర్ - 175 పజిల్స్లో ప్రపంచ రికార్డును సాధించాడు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ నుండి అధికారిక ధృవీకరణను అందుకున్నాడు.
Mon, 23 Dec 202404:05 AM IST
- Visakhapatnam : విశాఖపట్నం రైల్వే స్టేషన్లో భారీ ప్రమాదమే తప్పింది. ఒక రైలు ఏకంగా విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లింది. అయితే ఎటువంటి అపాయం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ వైర్లను తొలగించిన చాలా సేపు తరువాత రైలును పంపించారు.
Mon, 23 Dec 202403:07 AM IST
- AP Rains Update: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ముప్పు తప్పినట్టే తప్పి మళ్లీ తిరగబెట్టింది. దిశ మార్చుకుని బంగాళాఖాతంలోనే కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలకు మరోసారి వానగండం పొంచి ఉంది.
Mon, 23 Dec 202412:11 AM IST
- Rs1.2Cr For Food: ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో రెండు రోజుల భోజనాలకు అక్షరాలా రూ1.2కోట్ల రుపాయలు చెల్లిచారు. సచివాలయంలో రెండ్రోజుల పాటు సమావేశాల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు మంత్రులకు భోజనాలకు రూ1.2కోట్లను చెల్లించడం చర్చనీయాంశంగా మారింది.
Mon, 23 Dec 202412:06 AM IST
- AP Consulatncy Raj: ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలో పాలనలో వచ్చిన మార్పుల సంగతి పక్కన పెడితే కొందరు ఆలిండియా సర్వీస్ అధికారులు మాత్రం కన్సల్టెంట్ల మోజులో ముఖ్యమంత్రినే మభ్య పెట్టే స్థాయికి చేరుకున్నారు.సీఎంకు తెలియకుండానే కన్సల్టెంట్లను నియిమిస్తున్నారు.