Andhra Pradesh News Live December 2, 2024: Pushpa 2 Ticket Rates Hike : పుష్ప2 టికెట్ ధరలు పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, అదనపు షోలకు అనుమతి-today andhra pradesh news latest updates december 2 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live December 2, 2024: Pushpa 2 Ticket Rates Hike : పుష్ప2 టికెట్ ధరలు పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, అదనపు షోలకు అనుమతి

Pushpa 2 Ticket Rates Hike : పుష్ప2 టికెట్ ధరలు పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, అదనపు షోలకు అనుమతి

Andhra Pradesh News Live December 2, 2024: Pushpa 2 Ticket Rates Hike : పుష్ప2 టికెట్ ధరలు పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, అదనపు షోలకు అనుమతి

05:20 PM ISTDec 02, 2024 10:50 PM HT Telugu Desk
  • Share on Facebook
05:20 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Mon, 02 Dec 202405:20 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Pushpa 2 Ticket Rates Hike : పుష్ప2 టికెట్ ధరలు పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, అదనపు షోలకు అనుమతి

  • Pushpa 2 Ticket Rates Hike : పుష్ప2 టికెట్ ధరలు పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 4వ తేదీన రెండు బెనిఫిట్ షోలకు అనుమతినిచ్చింది. బెనిఫిట్ షోలకు టికెట్ ధర రూ.800లుగా నిర్ణయించింది. డిసెంబర్ 6 నుంచి 17 వరకు పెంచిన ధరలు అమల్లో ఉంటాయని పేర్కొంది. 

పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202404:49 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Civil Assistant Surgeon: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్,280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

  • AP Civil Assistant Surgeon Notification : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్ పరిధిలోని మొత్తం 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ 4 నుంచి 13వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202404:18 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Visakha Vijayawada Metro : విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్- రూ.22,507 కోట్లతో ఫేజ్-1 డీపీఆర్ లు ఆమోదం

  • Visakha Vijayawada Metro Projects : విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులలో కీలక అడుగుపడింది. ఈ రెండు మెట్రో ప్రాజెక్టుల ఫేజ్-1 డీపీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖ మెట్రో ఫేజ్-1 లో 46.23 కి.మీ మేర మూడు కారిడార్లు నిర్మించనున్నారు. విజయవాడ మెట్రో ఫేజ్-1 లో 38.4 కి.మీ మేర నిర్మించనున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202402:22 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Sachivalaya Staff Biometric : మూడుసార్లు బ‌యోమెట్రిక్ వేయాల్సిందే, లేక‌పోతే వేత‌నం క‌ట్‌- ఆందోళ‌న‌లో సచివాలయ ఉద్యోగులు

  • Sachivalaya Staff Biometric : సచివాలయ ఉద్యోగుల అటెండెన్స్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స‌చివాలయ ఉద్యోగులంతా రోజుకు మూడు సార్లు బయోమెట్రిక్ వేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202411:27 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Shocking Electricity Bills: ఏపీలో పెరిగిన విద్యుత్‌ బిల్లులు, కొత్త సర్దుపోటు మొదలు, విద్యుత్ పోరాటాలకు సీపీఎం పిలుపు..

  • Shocking Electricity Bills: ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ వినియోగదారులపై కొత్త సర్దుబాటు భారం మొదలైంది. ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి అమోదంతో రాష్ట్ర వ్యాప్తంగా  రూ.6వేల కోట్ల  సర్దుబాటు ఛార్జీల వసూలు మొదలైంది.  వచ్చే నెలలో మరో సర్దుబాటు భారం మొదలు కానుంది. పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం పిలుపునిచ్చింది. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202410:41 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: YS Sharmila : బోట్లు వేసుకెళ్లి హడావిడి చేయడం కాదు, రేషన్ మాఫియాపై నిజాలు నిగ్గు తేల్చండి- వైఎస్ షర్మిల

  • YS Sharmila : ప్రపంచానికి అన్నం పెట్టే ఆంధ్రప్రదేస్ ను రేషన్ బియ్యం మాఫియాకు అడ్డాగా మార్చారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఇది జాతీయ స్థాయి కుంభకోణం అన్నారు. రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉందని ఆరోపించారు.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202410:10 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Excise Rules: మద్యం విక్రయాలకు కొత్త రూల్స్‌.. ఎమ్మార్పీ ఉల్లంఘనకు రూ.5లక్షల జరిమానా, లైసెన్స్ రద్దు

  • AP Excise Rules: మద్యం విక్రయాల్లో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది.  మద్యం ఎమ్మార్పీ ఉల్లంఘనలు, బెల్ట్‌షాపులకు సరఫరాలపై  భారీ జరిమానాలు విధించింది. ఈ మేరకు ఎక్సైజ్‌ నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202410:05 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Cabinet Meeting : రేపే ఏపీ కేబినెట్ సమావేశం, చర్చకు రానున్న కీలక అంశాలు

  • AP Cabinet Meeting : ఏపీ కేబినెట్ సమావేశం రేపు జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. సూపర్ సిక్స్ హామీలు, కొత్త రేషన్ కార్డులు, రేషన్ బియ్యం అక్రమ రవాణా సహా పలు కీలక అంశాలు కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202409:04 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Pawan Meets CBN: చంద్రబాబుతో పవన్ కళ్యాణ్‌ భేటీ..రాజ్యసభ అభ్యర్థిత్వాలపై సర్వత్రా ఆసక్తి, మోపిదేవి స్థానంలో నాగబాబు?

  • Pawan Meets CBN: ఏపీలో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాల భర్తీకి మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. రాజ్యసభ అభ్యర్థిత్వాలను ఖరారు చేయనున్న నేపథ్యంలో ఈ భేటీ జరుగుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202408:58 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: YS Jagan Assets Case : రెండు వారాల్లోగా జగన్ అక్రమాస్తుల కేసుల పూర్తి వివరాలు ఇవ్వండి - సుప్రీంకోర్టు ఆదేశాలు

  • YS Jagan Assets Case : వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఆలస్యమవుతోందని దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులకు సంబంధించి పూర్తి వివరాలను రెండు వారాల్లోగా అందించాలని సీబీఐ, ఈడీలను ఆదేశించింది.

పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202407:00 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: YSRCP : హైదరాబాద్ బిర్యానీలో హైదరాబాద్ ఉండదు.. చంద్రబాబు పాలనలో పథకాలు ఉండవు.. వైసీపీ సెటైర్లు

  • YSRCP : పథకాల అమలు, ప్రజల అభిప్రాయంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. స్కీమ్స్ గురించి ఫీడ్ బ్యాక్ తీసుకుంటోంది. దీనిపై వైఎస్సార్సీపీ సెటైర్లు వేసింది. నేతి బీరకాయలో నెయ్యి వుండదు.. అలాగే చంద్రబాబు పాలనలో ఉత్తుత్తి పేర్లే తప్ప పథకాలు ఉండవని ఎద్దేవా చేసింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202405:46 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala Darshan Tickets: తిరుమలలో స్థానికులకు శ్రీవారి దర్శన టోకెన్లు జారీ… నెలకు 3వేల టోకెన్ల విడుదల

  • Tirumala Darshan Tickets: తిరుపతి, రేణిగుంట వాసుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలనే డిమాండ్‌ ఎట్టకేలకు నెరవేరింది. టీటీడీ బోర్డు నిర్ణయం మేరకు తిరుపతి వాసులకు శ్రీవారి దర్శనం  కల్పిస్తున్నారు. తొలి విడతగా డిసెంబర్ నెల కోటాను విడుదల చేశారు. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202404:40 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: APRation Mafia: ఊరురా రేషన్ మాఫియా... రాజకీయమే అసలు శాపం.. జనం తినని బియ్యానికి వేల కోట్ల ఖర్చు..

  • AP Ration Mafia: ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న రేషన్ బియ్యం అక్రమ ఎగుమతులకు అసలు కారణాలను అన్వేషించకుండా రాజకీయం సాగుతోంది. ఓట్ల వేటలో ఇబ్బడిముబ్బడిగా రేషన్‌ కార్డులు జారీ చేయడమే ఈ సమస్యకు మూల కారణం. జనం ఆహారంగా వినియోగించని దొడ్డు బియ్యంతో దళారులు కోట్లు కొల్లగొడుతున్నా ప్రభుత్వం కళ్లు ముసుకుంటోంది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202404:19 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Tirumala : ఫెంగల్ తుపాను ఎఫెక్ట్.. తిరుమల ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు

  • Tirumala : ఫెంగల్ తుపాను ఏపీ బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా తిరుపతి జిల్లాను అతలాకుతలం చేస్తోంది. అటు తిరుమల కొండపైనా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202403:52 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: APSRTC : ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. పంచ వైష్ణ‌వ క్షేత్ర ద‌ర్శినికి ప్ర‌త్యేక బ‌స్సులు.. ప్యాకేజీ వివరాలు ఇవే

  • APSRTC : పుణ్య‌క్షేత్రాల యాత్ర చేసే భక్తుల‌కు ఏపీఎస్ ఆర్టీసీ శుభ‌వార్త చెప్పింది. పంచ వైష్ణవ క్షేత్ర ద‌ర్శిని పేరుతో పుణ్య‌క్షేత్రాలకు స్పెష‌ల్ స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. డిసెంబర్ మాసంలో 4 రోజులు ఈ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. 
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202402:19 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Rajahmundry to Mumbai Flight : నెరవేరిన 20 ఏళ్ల కల.. రాజమండ్రి నుంచి ముంబయి ఎయిర్‌‌బస్ విమాన సర్వీసు ప్రారంభం

  • Rajahmundry to Mumbai Flight : రాజమండ్రి నుంచి ప్రధాన నగరాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం అయ్యాయి. తాజాగా ఇక్కడి నుంచి ముంబయికి ఎయిర్ బస్ స్టార్ట్ అయ్యింది. అటు రేణిగుంట- ముంబయి మధ్య కూడా డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభం అయ్యింది. దీనిపై ఏపీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202412:41 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vijayawada Kanaka Durga Temple : బెజవాడ దుర్గమ్మ ఆలయానికి మహర్దశ.. రూ.100 కోట్లతో అభివృద్ధి.. 10 ముఖ్యాంశాలు

  • Vijayawada Kanaka Durga Temple : విజయవాడ ఇంద్రకీలాద్రి అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దుర్గమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు చర్యలు చేపట్టింది.
పూర్తి స్టోరీ చదవండి

Mon, 02 Dec 202411:45 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Vijayawada : విజ‌య‌వాడ‌లో ఘోరం.. ప‌దో త‌ర‌గ‌తి బాలిక‌పై స‌వ‌తి తండ్రి అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

  • Vijayawada : విజ‌య‌వాడ‌లో ఘోర‌మైన ఘ‌ట‌న జరిగింది. ప‌దో త‌ర‌గ‌తి బాలిక‌పై స‌వ‌తి తండ్రి అత్యాచారం చేశాడు. బాలిక‌ను బెదిరించి అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. దీన్ని బాలిక త‌ల్లి నిల‌దీసింది. అప్ప‌టి నుంచి స‌వ‌తి తండ్రి ప‌రారీలో ఉన్నాడు. పోలీసులు పోక్సో కేసు న‌మోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి