Visakha Infosys Opening: విశాఖలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన సిఎం జగన్-cm jagan inaugurated the infosys center in visakhapatnam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Visakha Infosys Opening: విశాఖలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన సిఎం జగన్

Visakha Infosys Opening: విశాఖలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన సిఎం జగన్

Sarath Chandra HT Telugu
Oct 16, 2023 11:30 AM IST

Visakha Infosys Opening: విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ సంస్థ నూతనంగా నిర్మించిన కేంద్రాన్ని సిఎం జగన్ ప్రారంభించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో సిఎం పాల్గొంటున్నారు.

విశాఖలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న సిఎం జగన్
విశాఖలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న సిఎం జగన్

Visakha Infosys Opening: విశాఖలో ఇన్ఫోసిస్‌ నూతనంగా నిర్మించిన డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ ప్రతినిధులతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.

ఇన్ఫోసిస్‌ విశాఖపట్నంలో రూ. 35 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసిన ఈ కేంద్రాన్ని భవిష్యత్‌లో మరింతగా విస్తరించనున్నారు. సాప్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌గా పనిచేస్తుంది. దీని ఇంటీరియర్‌ డిజైన్‌ భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా హైబ్రీడ్‌ వర్క్‌ప్లేస్‌గా రూపొందించారు.

దాదాపు 1000 మంది ఉద్యోగులు ఈ సెంటర్‌ నుంచి పనిచేయనున్నారు. గ్రీన్‌ బిల్డింగ్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఈ కార్యాలయాన్ని నిర్మించారు. అత్యంత అధునాతన సదుపాయాలతో విశాలమైన ఆడియో, వీడియో కాన్ఫరెన్స్‌ హాల్స్, అధునాతన కెఫ్‌టేరియా, విశాలమైన పార్కింగ్‌ సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ఇన్ఫోసిస్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సదుపాయాలను సిఎం సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు.

విశాఖలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నందుకు సిఎం సంతోషం వ్యక్తం చేశారు. విశాఖకు అన్ని అనుకూలతలు ఉన్నాయని, హైదరాబాద్‌, చెన్నై, బెంగుళూరు స్థాయిలో అభివృద్ధి చెందడానికి విశాఖక అవకాశాలు ఉన్నాయని, రాష్ట్ర విభజన తర్వాత అన్ని అనుకూలతలు ఉన్న నగరం ఇదొక్కటే అన్నారు. హైదరాబాద్‌ వంటి నగరం నగరం ఇప్పటి వరకు ఆంధ్రాకు లేకుండా పోయిందని చెప్పారు. ఈ తరహా పరిశ్రమలు రావడం వల్ల విశాఖ కూడా త్వరగా ఎదుగుతుందని చెప్పారు.

డిసెంబర్‌ నుంచి విశాఖలో పాలన

రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద నగరంగా ఉన్న విశాఖకు అన్ని అనుకూలతలు ఉన్నాయని సిఎం పునరుద్ఘాటించారు. విశాఖలో ప్రతిష్టాత్మక సంస్థాలు ఉన్నాయని, మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలతో 12-15వేల మంది ఏటా ఇంజనీర్లు విశాఖ నుంచి వస్తున్నారని చెప్పారు. ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థలు విశాఖలో ఉన్నందున వేగంగా అభివృద్ధి చెందొచ్చన్నారు. ఐఓసి, ఈస్ట్రర్న్‌ నావల్ కమాండ్‌లో 20వేల మంది పనిచేస్తున్నారని, పోర్ట్ ఆధారిత మౌలిక సదుపాయాలు విశాఖపట్నంలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అన్ని సదుపాయలు ఇప్పటికే ఉన్నాయని, రెండేళ్లలో ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్ట్ అందుబాటులో వస్తుందన్నారు.

తాను విశాఖపట్నం రావడానికి అనువైన కార్యాలయం వెదకాలని ఇప్పటికే సూచించినట్లు చెప్పారు. సిఎంఓ అధికారులు కూడా కార్యాలయాల ఏర్పాటులో నిమగ్నం అయ్యారని,అక్టోబర్‌ నాటికి కొలిక్కి వస్తుందనుకున్నాని వివరించారు. డిసెంబర్‌ నాటికి ఖచ్చితంగా విశాఖలోనే ఉంటానని చెప్పారు. విశాఖలో ఇన్ఫోసిస్ ఏర్పాటుతో ముందడుగు పడుతుందన్నారు. సిఎం తరలి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోతుందని చెప్పారు. అక్టోబర్‌ నాటికి రావాలనుకున్నానని డిసెంబర్ కావొచ్చన్నారు. తాను ఇకపై విశాఖలోనే ఉంటానని సిఎం స్పష్టం చేశారు.

విశాఖలో అదానీ డేటా సెంటర్‌ ఏర్పాటవుతోందని సింగపూర్‌ నుంచి మెరైన్ డేటా కేబుల్ విశాఖకు ఏర్పాటవుతోందని చెప్పారు. ఐటీ ఆధారిత పరిశ్రమలకు అనువైన వాతావరణం విశాఖలో ఉంటుందని చెప్పారు. విశాఖ ఇన్ఫోసిస్ కేంద్రం అద్భుతాలు చేస్తుందని చెప్పారు. విశాఖ ఇన్ఫోసిస్ అత్యుత్తమ కేంద్రంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పారు.ఇన్ఫోసిస్‌‌కు ఏ అవసరం వచ్చినా ఫోన్‌కాల్‌ దూరంలో సిఎంఓ అందుబాటులో ఉంటుందని హామీ ఇచ్చారు.

IPL_Entry_Point