తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tollywood Drugs Case : టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు - ఆరు కేసులు కొట్టివేత!

Tollywood Drugs Case : టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక మలుపు - ఆరు కేసులు కొట్టివేత!

01 February 2024, 16:56 IST

    • Tollywood Drugs Case Updates: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తీర్పునిచ్చింది హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు. 8 కేసుల్లో ఆరు కేసులను కొట్టివేసింది. ఆరు కేసుల్లో ఎలాంటి సాక్ష్యాలు, ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసు
టాలీవుడ్ డ్రగ్స్ కేసు

టాలీవుడ్ డ్రగ్స్ కేసు

Tollywood Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో గురువారం నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. 2018లో ఎక్సైజ్ శాఖ 8 కేసులను నమోదు చేసింది. ఇందులో ఆరు కేసులను న్యాయస్థానం కొట్టివేసింది. ఎక్సైజ్ శాఖ సరైన ప్రోసిజర్స్ పాటించలేదని అభిప్రాయపడింది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా సరైన ఆధారాలు లేకపోవడంతో కేసులు కొట్టివేసినట్లు పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

Medak Thunderstrom: మెదక్ జిల్లాలో అకాల వర్షం… పిడుగు పాటుతో తాత మనుమడి మృతి, ధాన్యం కాపాడుకునే ప్రయత్నంలో విషాదం

Hyd Bike Blast: హైదరాబాద్‌లో ఘోరం, బైక్‌‌లో మంటలు ఆర్పుతుండగా భారీ పేలుడు, పలువురికి తీవ్ర గాయాలు

Electrocution : ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యుత్ షాక్ కు గురై నలుగురు దుర్మరణం

IRCTC Tamilnadu Tour Package : 6 రోజుల్లో తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

టాలీవుడ్ డ్రగ్స్ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో టాలీవుడ్ కు చెందిన చాలా మందిని విచారించారు. నెలల తరబడి ఈ విచారణ కొనసాగింది. పలువురి నటుల నుంచి గోళ్లు, వెంట్రుకలను కూడా సేకరించారు. వారి నుంచి తీసుకున్న శాంపిల్స్ ను ఎఫ్ఎస్ఎల్ కు పంపారు. బీఆర్ఎస్ హయాంలో ఎక్సైజ్ శాఖ నమోదు చేసిన ఈ కేసులో 12 మంది పేర్లు ఉన్నాయి. దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో తరుణ్ తో పాటు పలువురు ఇందులో ఉన్నారు. పూరీ జగన్నాథ్, తరుణ్ నుంచి సేకరించిన శాంపిల్లల్లో ఎలాంటి డ్రగ్స్ అనావాళ్లు లేనట్లు ఎఫ్ఎస్ఎల్ నివేదికల్లో వెల్లడైనట్లు తేలింది. వీటితో పాటు పలు సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం… ఆరు కేసులను కొట్టివేసింది. మరో రెండు కేసుల్లో విచారణ జరుగుతోంది.

తదుపరి వ్యాసం