నిజామాబాద్ లో దారుణం.. పండ్ల రసం ఇప్పిస్తానని తీసుకెళ్లి బాలికపై అత్యాచారం
24 April 2022, 11:39 IST
- నిజామాబాద్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. 9 ఏళ్ల బాలికకు పండ్ల రసం ఇప్పిస్తానని తీసుకెళ్లి అత్యాచారం చేశాడు ఓ ప్రబుద్ధుడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మైనర్ బాలికపై అత్యాచారం
9 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. రెండ్రోజుల కిందట జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.
నిజామాబాద్ జిల్లా జక్రాన్ ప్లలి శివారులో ఓ దంపతులు గుడిసె వేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఓ 9 ఏళ్ల కూతురు ఉంది. సమీపంలో చిన్న చిన్న పనులు చూసుకుంటూ కుమార్తెను పోషిస్తోంది. సరిగ్గా వీటన్నింటిని అంచనా వేసుకున్నాడు స్థానిక వ్యక్తి నారాయణ(35). ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను పిలిచి పండ్ల రసం కొనిస్తానని చెప్పి.. ఈ నెల 22న ఓ కొండ ప్రాంతానికి తీసుకెళ్లాడు.
కూలీ పనుల నుంచి ఇంటికి చేరుకున్న తల్లి బిడ్డ కనిపించకపోవడంతో కంగారుపడింది. వెంటనే సమీప ప్రాంతాల్లో వెతకగా ఈ దారుణం బయటపడింది. బాలికను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
టాపిక్