తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  నిజామాబాద్ లో దారుణం.. పండ్ల రసం ఇప్పిస్తానని తీసుకెళ్లి బాలికపై అత్యాచారం

నిజామాబాద్ లో దారుణం.. పండ్ల రసం ఇప్పిస్తానని తీసుకెళ్లి బాలికపై అత్యాచారం

HT Telugu Desk HT Telugu

24 April 2022, 11:39 IST

    • నిజామాబాద్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. 9 ఏళ్ల బాలికకు పండ్ల రసం ఇప్పిస్తానని తీసుకెళ్లి అత్యాచారం చేశాడు ఓ ప్రబుద్ధుడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మైనర్ బాలికపై అత్యాచారం
మైనర్ బాలికపై అత్యాచారం

మైనర్ బాలికపై అత్యాచారం

9 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. రెండ్రోజుల కిందట జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

BRS Protest: బోనస్ బోగసేనా?... రోడ్డెక్కిన బీఆర్ఎస్.. ప్రభుత్వ తీరుపై ధర్నాలు, రాస్తారోకోలతో BRS నిరసన

Hyderabadi In UK Polls: యూకే పార్లమెంట్ ఎన్నికల బరిలో సిద్ధిపేట ఐటీ ఇంజనీర్‌, లేబర్ పార్టీ తరపున పోటీ

Graduate Mlc Election: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీపై బీజేపీ గురి, కీలక నేతలకు ఇన్‌ఛార్జి బాధ్యతలు

Warangal Rains: వరంగల్‌లో ఈదురు గాలులతో భారీ వర్షం, రైతులకు తీవ్ర నష్టం.. గ్రేటర్ లో ఆఫీసర్లు అలర్ట్

నిజామాబాద్ జిల్లా జక్రాన్ ప్లలి శివారులో ఓ దంపతులు గుడిసె వేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఓ 9 ఏళ్ల కూతురు ఉంది. సమీపంలో చిన్న చిన్న పనులు చూసుకుంటూ కుమార్తెను పోషిస్తోంది. సరిగ్గా వీటన్నింటిని అంచనా వేసుకున్నాడు స్థానిక వ్యక్తి నారాయణ(35). ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను పిలిచి పండ్ల రసం కొనిస్తానని చెప్పి.. ఈ నెల 22న ఓ కొండ ప్రాంతానికి తీసుకెళ్లాడు.

కూలీ పనుల నుంచి ఇంటికి చేరుకున్న తల్లి బిడ్డ కనిపించకపోవడంతో కంగారుపడింది. వెంటనే సమీప ప్రాంతాల్లో వెతకగా ఈ దారుణం బయటపడింది. బాలికను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

టాపిక్

తదుపరి వ్యాసం