తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Woman Gang-raped: మహిళపై సామూహిక అత్యాచారం, హత్య; అప్పు తీర్చమని అడిగినందుకు..

Woman gang-raped: మహిళపై సామూహిక అత్యాచారం, హత్య; అప్పు తీర్చమని అడిగినందుకు..

HT Telugu Desk HT Telugu

09 December 2023, 13:59 IST

    • Woman gang-raped: తన దగ్గర తీసుకున్న అప్పును తీర్చమని అడిగిన పాపానికి ముగ్గురు రాక్షసులు ఒక మహిళను దారుణంగా గ్యాంగ్ రేప్ చేసి, హత్య చేశారు. 
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Woman gang-raped: సుమారు 50 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసి, ఆ తరువాత హతమార్చిన ఘటన మధ్యప్రదేశ్ (Madhya Pradesh crime news) లోని గుణ జిల్లాలో జరిగింది. ఆ దారుణానికి పాల్పడిన దుండగులు బాధిత మహిళ వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకున్నారని, ఆ డబ్బు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఆ మహిలపై ఈ దారుణానికి పాల్పడ్డారు.

అప్పు తీర్చమన్నందుకు..

గుణ (guna) ఎస్పీ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మధ్య ప్రదేశ్ లోని గుణ జిల్లాలో ఉన్న తెలి గ్రామానికి చెందిన హరినారాయణ లోధి, రాం భరోసా, మహేంద్ర లోధీ అనే ముగ్గురు నిందితులు భోపాల్ సమీపంలోని నజీరాబాద్ కు చెందిన ఒక మహిళ వద్ద కొంత డబ్బు అప్పుగా తీసుకున్నారు. వారి వద్ద తన డబ్బును వసూలు చేసుకోవడానికి ఆ మహిళ తెలి గ్రామానికి వచ్చింది. ఆమెను గ్రామ శివార్లలోనే అడ్డగించిన నిందితులు ఆమెపై దాడి చేశారు. ఆమెను తీవ్రంగా కొట్టి, ఆమెపై సామూహిక అత్యాచారానికి (Woman gang-raped, killed) పాల్పడ్డారు. అనంతరం, ఆమెను హత్య చేసి, మృతదేహాన్ని సమీపంలోని ఒక కాలువ వద్ద రాళ్లతో కప్పెట్టారు.

స్థానికుల సమాచారం..

మృతదేహం పడి ఉన్న ప్రాంతం నుంచి భరించలేని దుర్వాసన వస్తుండడంతో అక్కడికి వెళ్లిన స్థానికులకు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఆ మహిళ మృతదేహం కనిపించింది. వెంటనే, వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తుల నిందితుల వివరాలు తెలిసాయి. వెంటనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేయడం వల్లనే ఈ ఘాతుకానికి పాల్పడ్డామని ఆ నిందితులు పోలీసులకు తెలిపారు.

తదుపరి వ్యాసం