Boys gang raped girl in classroom : క్లాస్రూమ్లో దారుణం- బాలికపై విద్యార్థులు అత్యాచారం!
02 December 2022, 8:47 IST
- Boys gang raped girl in classroom : 13ఏళ్ల బాలికపై.. క్లాస్రూమ్లోనే అత్యాచారానికి ఒడిగట్టారు ఇద్దరు విద్యార్థులు. ఈ ఘటన ముంబైలోని ఓ స్కూల్లో కలకలం సృష్టించింది.
క్లాస్రూమ్లో దారుణం- బాలికపై విద్యార్థులు అత్యాచారం!
Boys gang raped girl in classroom : ముంబైలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలిక.. క్లాస్రూమ్లో సామూహిక అత్యాచారానికి గురైంది. ఎవరూ లేని సమయంలో.. అదే క్లాస్కు చెందిన ఇద్దరు విద్యార్థులు.. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు.
ఇదీ జరిగింది..
సెంట్రల్ ముంబైలోని ఓ సివిక్ స్కూల్లో సోమవారం జరిగింది ఈ ఘటన. 13ఏళ్ల బాలిక ఫిర్యాదుతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.
"బాధితురాలు, నిందితులు 8వ తరగతిలో చదువుకుంటున్నారు. ఆ రోజు అందరు డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం కిందికి వెళ్లారు. ఈ ముగ్గురే క్లాస్రూమ్లో ఉండిపోయారు. ఈ సమయంలోనే.. బాలికపై ఇద్దరు అబ్బాయిలు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఘటనపై బాలిక భయపడింది. అందుకే ఇంట్లో ఆలస్యంగా చెప్పింది. బాధిత కుటుంబసభ్యులు మా వద్దకు వచ్చి ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించాము. నిందితులను జువనైల్ జస్టిస్ బోర్డ్ ముందు హాజరుపరిచాము. అక్కడి నుంచి డోంగ్రీలోని చిల్డ్రెన్ హోమ్కు పంపించాము," అని మాతుంగ పోలీస్ స్టేషన్లోని అధికారులు వెల్లడించారు. నిందితులపై సెక్షన్ 376 డీ-ఏ, 506, పోక్సో చట్టం కింద కేసు వేసినట్టు స్పష్టం చేశారు.
Student gang raped in classroom : "ఈ ఘటన క్లాస్రూమ్లో జరిగింది. అందువల్ల స్కూల్ యాజమాన్యం స్టేట్మెంట్ను కూడా రికార్డు చేస్తాము. నిందితుల స్టేట్మెంట్ను కూడా రికార్డు చేశాము. ఘటనతో స్కూల్లోని అందరు షాక్కు గురయ్యారు. అయితే.. రేప్ గురించి ఎవరికైనా చెబితే.. తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని.. బాలికను వారిద్దరు బెదిరించినట్టు తెలుస్తోంది," అని ఓ పోలీసు వెల్లడించారు.
పెరిగిపోతున్న నేరాలు..
దేశంలో మహిళలు, బాలికలపై నేరాలు ఆందోళనకరంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్థితులు అత్యంత తీవ్రంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఇటీవలే ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కళ్యాణ్ పట్టణంలో.. 9 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, ఆపై చంపేసిన కొందరు.. ఆమె మృతదేహాన్ని రైలు పట్టాల పక్కన పడేసి వెళ్లిపోయారు.
Maharashtra crime news : స్థానికంగా ఉన్న రైల్వే స్టేషన్ దగ్గరలో పట్టాల పక్కన 9 ఏళ్ల చిన్నారి బాలిక అచేతనంగా పడి ఉంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ బాలికను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆ బాలిక చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. పోస్ట్ మార్టం నివేదికలో ఆ బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది. దాంతో, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
దర్యాప్తులో భాగంగా, పోలీసులు ఒక 15 ఏళ్ల బాలుడిని అనుమానించారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే, ఈ హత్యాచారంలో ఆ బాలుడి ప్రమేయం లేదని నిర్ధారించుకుని, ఆ బాలుడిని వదిలేశారు. ఆ బాలుడికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని డీసీపీ సచిన్ గుంజల్ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీ, పొక్సొ చట్టాల్లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.