తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Boys Gang Raped Girl In Classroom : క్లాస్​రూమ్​లో దారుణం- బాలికపై విద్యార్థులు అత్యాచారం!

Boys gang raped girl in classroom : క్లాస్​రూమ్​లో దారుణం- బాలికపై విద్యార్థులు అత్యాచారం!

02 December 2022, 8:47 IST

    • Boys gang raped girl in classroom : 13ఏళ్ల బాలికపై.. క్లాస్​రూమ్​లోనే అత్యాచారానికి ఒడిగట్టారు ఇద్దరు విద్యార్థులు. ఈ ఘటన ముంబైలోని ఓ స్కూల్​లో కలకలం సృష్టించింది.
 క్లాస్​రూమ్​లో దారుణం- బాలికపై విద్యార్థులు అత్యాచారం!
క్లాస్​రూమ్​లో దారుణం- బాలికపై విద్యార్థులు అత్యాచారం!

క్లాస్​రూమ్​లో దారుణం- బాలికపై విద్యార్థులు అత్యాచారం!

Boys gang raped girl in classroom : ముంబైలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలిక.. క్లాస్​రూమ్​లో సామూహిక అత్యాచారానికి గురైంది. ఎవరూ లేని సమయంలో.. అదే క్లాస్​కు చెందిన ఇద్దరు విద్యార్థులు.. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు.

ట్రెండింగ్ వార్తలు

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

Air India: పుణె ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి ప్రమాదం; ప్రయాణికులు, సిబ్బంది సేఫ్

ఇదీ జరిగింది..

సెంట్రల్​ ముంబైలోని ఓ సివిక్​ స్కూల్​లో సోమవారం జరిగింది ఈ ఘటన. 13ఏళ్ల బాలిక ఫిర్యాదుతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.

"బాధితురాలు, నిందితులు 8వ తరగతిలో చదువుకుంటున్నారు. ఆ రోజు అందరు డ్యాన్స్​ ప్రాక్టీస్​ కోసం కిందికి వెళ్లారు. ఈ ముగ్గురే క్లాస్​రూమ్​లో ఉండిపోయారు. ఈ సమయంలోనే.. బాలికపై ఇద్దరు అబ్బాయిలు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఘటనపై బాలిక భయపడింది. అందుకే ఇంట్లో ఆలస్యంగా చెప్పింది. బాధిత కుటుంబసభ్యులు మా వద్దకు వచ్చి ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించాము. నిందితులను జువనైల్​ జస్టిస్​ బోర్డ్​ ముందు హాజరుపరిచాము. అక్కడి నుంచి డోంగ్రీలోని చిల్డ్రెన్​ హోమ్​కు పంపించాము," అని మాతుంగ పోలీస్​ స్టేషన్​లోని అధికారులు వెల్లడించారు. నిందితులపై సెక్షన్​ 376 డీ-ఏ, 506, పోక్సో చట్టం కింద కేసు వేసినట్టు స్పష్టం చేశారు.

Student gang raped in classroom : "ఈ ఘటన క్లాస్​రూమ్​లో జరిగింది. అందువల్ల స్కూల్​ యాజమాన్యం స్టేట్​మెంట్​ను కూడా రికార్డు చేస్తాము. నిందితుల స్టేట్​మెంట్​ను కూడా రికార్డు చేశాము. ఘటనతో స్కూల్​లోని అందరు షాక్​కు గురయ్యారు. అయితే.. రేప్​ గురించి ఎవరికైనా చెబితే.. తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని.. బాలికను వారిద్దరు బెదిరించినట్టు తెలుస్తోంది," అని ఓ పోలీసు వెల్లడించారు.

పెరిగిపోతున్న నేరాలు..

దేశంలో మహిళలు, బాలికలపై నేరాలు ఆందోళనకరంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్థితులు అత్యంత తీవ్రంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఇటీవలే ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కళ్యాణ్ పట్టణంలో.. 9 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, ఆపై చంపేసిన కొందరు.. ఆమె మృతదేహాన్ని రైలు పట్టాల పక్కన పడేసి వెళ్లిపోయారు.

Maharashtra crime news : స్థానికంగా ఉన్న రైల్వే స్టేషన్ దగ్గరలో పట్టాల పక్కన 9 ఏళ్ల చిన్నారి బాలిక అచేతనంగా పడి ఉంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ బాలికను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆ బాలిక చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. పోస్ట్ మార్టం నివేదికలో ఆ బాలికపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది. దాంతో, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో భాగంగా, పోలీసులు ఒక 15 ఏళ్ల బాలుడిని అనుమానించారు. అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే, ఈ హత్యాచారంలో ఆ బాలుడి ప్రమేయం లేదని నిర్ధారించుకుని, ఆ బాలుడిని వదిలేశారు. ఆ బాలుడికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని డీసీపీ సచిన్ గుంజల్ తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీ, పొక్సొ చట్టాల్లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.

తదుపరి వ్యాసం