సూట్కేస్లో మహిళ మృతదేహం.. డ్రైనేజ్లో పడేసి!
07 February 2022, 16:00 IST
Woman's body found in suitcase | మార్నింగ్ వాక్కు వెళ్లిన కొందరికి ఒళ్లుగగుర్పొడిచే సన్నివేశం ఎదురైంది. దుర్వాసన వస్తోందని చూడటానికి వెళ్లిన వారికి.. డ్రైనేజ్లో ఓ సూట్కేస్ కనిపించింది. తెరిచి చూడగా.. ఓ మహిళ మృతదేహం బయటపడింది. వారందరూ ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పుర్లో జరిగింది.
తమిళనాడులో కలకలం.. సూట్కేస్లో మహిళ మృతదేహం
Tirupur crime news today | తమిళనాడు తిరుప్పుర్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. డ్రైనేజ్లో పడేసి ఉన్న సూట్కేస్లో ఓ మహిళ మృతదేహం కనిపించింది.
ఇదీ జరిగింది..
పుతునగర్లోని నల్లూరు- ధరంపురం రోడ్డులో.. సోమవారం ఉదయం కొందరు మార్నింగ్ వాక్కు వెళ్లారు. ఆ ప్రాంతంలో ఉన్న డ్రేనేజ్లో దుర్వాసన వస్తుండటంతో కొందరు దగ్గరికి వెళ్లిచూశారు. ఓ పెద్ద సూట్కేస్ వారికి కనిపించింది.
ఆ సూట్కేస్ను ఓపెన్ చేసిన స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఓ మహళ మృతదేహం ఆ సూట్కేస్లో కనిపించడంతో షాక్ అయ్యారు. ఈ విషయంపై వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. సూట్కేస్తో పాటు పరిసర ప్రాంతాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. మహిళ మెడపై గాట్లు ఉండటాన్ని గుర్తించారు. ఆమె గొంతు నులిమి ఎవరో హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం కుళ్లిపోకపోవడంతో.. ఆదివారమే ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు.
ఆ మహిళ వివరాలను పోలీసులు కనుక్కోలేకపోయారు. కాగా ఆమెకు 25ఏళ్ల వయస్సు ఉంటుందని భావిస్తున్నారు. పోస్ట్మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసినట్టు, ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపినట్టు అధికారులు వెల్లడించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
రూ. 100 కోసం గొడవ.. చివరికి!
Mumbai crime news | దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర ముంబయిలో.. రూ. 100 కోసం గొడవ ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. అతడిని ఊపిరాడనివ్వకుండా చేసిన వ్యక్తి.. నేరాన్ని కప్పిపుచ్చేందుకు విఫలయత్నం చేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.
దహిసర్ ప్రాంతంలో కొకాట పరమేశ్వర్, రాజు పాటిల్లు పక్కపక్కన ఇళ్లల్లో నివాసముంటున్నారు. ఓ రోజు.. పరమేశ్వర్ బంధువుకు రాజు పాటిల్ రూ. 100 అప్పు ఇచ్చాడు. ఇదే విషయంపై శుక్రవారం పరమేశ్వర్ ఇంటికి వెళ్లాడు పాటిల్. తన 100 రూపాయలు తిరిగివ్వాలని అడిగాడు. కానీ పరమేశ్వర్ ఇవ్వనని తేల్చిచెప్పేశాడు. దీంతో కోపం తెచ్చుకున్న పాటిల్.. పరమేశ్వర్ను అసభ్యకరంగా తిట్టడం మొదలుపెట్టాడు. వాగ్వాదం ముదిరి.. పాటిల్పై పరమేశ్వర్ దాడి చేశాడు. చివరికి ఊపిరాడనివ్వకుండా చేసి.. అతడిని చంపేశాడు.
ఆ తర్వాత.. చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు పరమేశ్వర్. పాటిల్ మృతదేహాన్ని ఓ దుప్పటికి చుట్టి.. నిప్పంటించాడు. 10నిమిషాల తర్వాత.. తన పొరుగింటి వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నాడని పోలీసులకు ఫోన్ చేశాడు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. పాటిల్ను ఆసుపత్రికి తరలించారు. కాగా అతను అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
మృతదేహానికి పోస్టుమార్టం చేసిన తర్వాత అసలు విషయం బయటపడింది. పాటిల్ అనే వ్యక్తి.. కాలిన గాయాలతో మరణించలేదని, అతడిని ఎవరో ఊపిరాడనివ్వకుండా చేసి హతమార్చారని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా.. పోలీసులు పరమేశ్వర్ను అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా.. చేసిన నేరాన్ని అతడు అంగీకరించాడు.
Tirupur crime news today | తమిళనాడు తిరుప్పుర్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. డ్రైనేజ్లో పడేసి ఉన్న సూట్కేస్లో ఓ మహిళ మృతదేహం కనిపించింది.
ఇదీ జరిగింది..
పుతునగర్లోని నల్లూరు- ధరంపురం రోడ్డులో.. సోమవారం ఉదయం కొందరు మార్నింగ్ వాక్కు వెళ్లారు. ఆ ప్రాంతంలో ఉన్న డ్రేనేజ్లో దుర్వాసన వస్తుండటంతో కొందరు దగ్గరికి వెళ్లిచూశారు. ఓ పెద్ద సూట్కేస్ వారికి కనిపించింది.
ఆ సూట్కేస్ను ఓపెన్ చేసిన స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఓ మహళ మృతదేహం ఆ సూట్కేస్లో కనిపించడంతో షాక్ అయ్యారు. ఈ విషయంపై వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. సూట్కేస్తో పాటు పరిసర ప్రాంతాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. మహిళ మెడపై గాట్లు ఉండటాన్ని గుర్తించారు. ఆమె గొంతనులిమి ఎవరో హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం కుళ్లిపోకపోవడంతో.. ఆదివారమే ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు.
ఆ మహిళ వివరాలను పోలీసులు కనుక్కోలేకపోయారు. కాగా ఆమెకు 25ఏళ్ల వయస్సు ఉంటుందని భావిస్తున్నారు. పోస్ట్మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసినట్టు, త్వరలోనే పట్టుకుంటామని అధికారులు వెల్లడించారు.
రూ. 100 కోసం గొడవ.. చివరికి!
Mumbai crime news | దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర ముంబయిలో.. రూ. 100 కోసం గొడవ ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. అతడిని ఊపిరాడనివ్వకుండా చేసిన వ్యక్తి.. నేరాన్ని కప్పిపుచ్చేందుకు విఫలయత్నం చేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు.
దహిసర్ ప్రాంతంలో కొకాట పరమేశ్వర్, రాజు పాటిల్లు పక్కపక్కన ఇళ్లల్లో నివాసముంటున్నారు. ఓ రోజు.. పరమేశ్వర్ బంధువుకు రాజు పాటిల్ రూ. 100 అప్పు ఇచ్చాడు. ఇదే విషయంపై శుక్రవారం పరమేశ్వర్ ఇంటికి వెళ్లాడు పాటిల్. తన 100 రూపాయలు తిరిగివ్వాలని అడిగాడు. కానీ పరమేశ్వర్ ఇవ్వనని తేల్చిచెప్పేశాడు. దీంతో కోపం తెచ్చుకున్న పాటిల్.. పరమేశ్వర్ను అసభ్యకరంగా తిట్టడం మొదలుపెట్టాడు. వాగ్వాదం ముదిరి.. పాటిల్పై పరమేశ్వర్ దాడి చేశాడు. చివరికి ఊపిరాడనివ్వకుండా చేసి.. అతడిని చంపేశాడు.
ఆ తర్వాత.. చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు పరమేశ్వర్. పాటిల్ మృతదేహాన్ని ఓ దుప్పటికి చుట్టి.. నిప్పంటించాడు. 10నిమిషాల తర్వాత.. తన పొరుగింటి వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నాడని పోలీసులకు ఫోన్ చేశాడు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. పాటిల్ను ఆసుపత్రికి తరలించారు. కాగా అతను అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
మృతదేహానికి పోస్టుమార్టం చేసిన తర్వాత అసలు విషయం బయటపడింది. పాటిల్ అనే వ్యక్తి.. కాలిన గాయాలతో మరణించలేదని, అతడిని ఎవరో ఊపిరాడనివ్వకుండా చేసి హతమార్చారని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా.. పోలీసులు పరమేశ్వర్ను అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా.. చేసిన నేరాన్ని అతడు అంగీకరించాడు.
|#+|