తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  సూట్​కేస్​లో మహిళ మృతదేహం.. డ్రైనేజ్​లో పడేసి!

సూట్​కేస్​లో మహిళ మృతదేహం.. డ్రైనేజ్​లో పడేసి!

HT Telugu Desk HT Telugu

07 February 2022, 16:00 IST

  • Woman's body found in suitcase | మార్నింగ్​ వాక్​కు వెళ్లిన కొందరికి ఒళ్లుగగుర్పొడిచే సన్నివేశం ఎదురైంది. దుర్వాసన వస్తోందని చూడటానికి వెళ్లిన వారికి.. డ్రైనేజ్​లో ఓ సూట్​కేస్​ కనిపించింది. తెరిచి చూడగా.. ఓ మహిళ మృతదేహం బయటపడింది. వారందరూ ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పుర్​లో జరిగింది.

తమిళనాడులో కలకలం.. సూట్​కేస్​లో మహిళ మృతదేహం
తమిళనాడులో కలకలం.. సూట్​కేస్​లో మహిళ మృతదేహం

తమిళనాడులో కలకలం.. సూట్​కేస్​లో మహిళ మృతదేహం

Tirupur crime news today | తమిళనాడు తిరుప్పుర్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. డ్రైనేజ్​లో పడేసి ఉన్న సూట్​కేస్​లో ఓ మహిళ మృతదేహం కనిపించింది.

ట్రెండింగ్ వార్తలు

Israel-Hamas war: ఐరాసలో పాలస్తీనాకు అనుకూలంగా ఓటేసిన భారత్; నెగ్గిన ప్రతిపాదన

International Space Station: మే 14 వరకు ఈ సమయాల్లో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ ను నేరుగా చూసే అవకాశం

Crime news : దారుణం.. తల్లి, భార్యను చంపి- పిల్లల్ని మేడ మీద నుంచి పడేసి.. చివరికి..!

Prajwal Revanna case : ప్రజ్వల్​ రేవన్నపై ఫిర్యాదు చేసిన బీజేపీ నేత అరెస్ట్​- మరో మహిళపై..

ఇదీ జరిగింది..

పుతునగర్​లోని నల్లూరు- ధరంపురం రోడ్డులో.. సోమవారం ఉదయం కొందరు మార్నింగ్​ వాక్​కు వెళ్లారు. ఆ ప్రాంతంలో ఉన్న డ్రేనేజ్​లో దుర్వాసన వస్తుండటంతో కొందరు దగ్గరికి వెళ్లిచూశారు. ఓ పెద్ద సూట్​కేస్​ వారికి కనిపించింది.

ఆ సూట్​కేస్​ను ఓపెన్​ చేసిన స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఓ మహళ మృతదేహం ఆ సూట్​కేస్​లో కనిపించడంతో షాక్​ అయ్యారు. ఈ విషయంపై వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. సూట్​కేస్​తో పాటు పరిసర ప్రాంతాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. మహిళ మెడపై గాట్లు ఉండటాన్ని గుర్తించారు. ఆమె గొంతు నులిమి ఎవరో హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం కుళ్లిపోకపోవడంతో.. ఆదివారమే ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు.

ఆ మహిళ వివరాలను పోలీసులు కనుక్కోలేకపోయారు. కాగా ఆమెకు 25ఏళ్ల వయస్సు ఉంటుందని భావిస్తున్నారు. పోస్ట్​మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసినట్టు, ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపినట్టు అధికారులు వెల్లడించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

రూ. 100 కోసం గొడవ.. చివరికి!

Mumbai crime news | దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర ముంబయిలో.. రూ. 100 కోసం గొడవ ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. అతడిని ఊపిరాడనివ్వకుండా చేసిన వ్యక్తి.. నేరాన్ని కప్పిపుచ్చేందుకు విఫలయత్నం చేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. 

దహిసర్​ ప్రాంతంలో కొకాట పరమేశ్వర్​, రాజు పాటిల్​లు పక్కపక్కన ఇళ్లల్లో నివాసముంటున్నారు. ఓ రోజు.. పరమేశ్వర్​ బంధువుకు రాజు పాటిల్​ రూ. 100 అప్పు ఇచ్చాడు. ఇదే విషయంపై శుక్రవారం పరమేశ్వర్​ ఇంటికి వెళ్లాడు పాటిల్​. తన 100 రూపాయలు తిరిగివ్వాలని అడిగాడు. కానీ పరమేశ్వర్​ ఇవ్వనని తేల్చిచెప్పేశాడు. దీంతో కోపం తెచ్చుకున్న పాటిల్​.. పరమేశ్వర్​ను అసభ్యకరంగా తిట్టడం మొదలుపెట్టాడు. వాగ్వాదం ముదిరి.. పాటిల్​పై పరమేశ్వర్​ దాడి చేశాడు. చివరికి ఊపిరాడనివ్వకుండా చేసి.. అతడిని చంపేశాడు.

ఆ తర్వాత.. చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు పరమేశ్వర్​. పాటిల్​ మృతదేహాన్ని ఓ దుప్పటికి చుట్టి.. నిప్పంటించాడు. 10నిమిషాల తర్వాత.. తన పొరుగింటి వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నాడని పోలీసులకు ఫోన్​ చేశాడు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. పాటిల్​ను ఆసుపత్రికి తరలించారు. కాగా అతను అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

మృతదేహానికి పోస్టుమార్టం చేసిన తర్వాత అసలు విషయం బయటపడింది. పాటిల్​ అనే వ్యక్తి.. కాలిన గాయాలతో మరణించలేదని, అతడిని ఎవరో ఊపిరాడనివ్వకుండా చేసి హతమార్చారని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా.. పోలీసులు పరమేశ్వర్​ను అరెస్ట్​ చేశారు. విచారణలో భాగంగా.. చేసిన నేరాన్ని అతడు అంగీకరించాడు.

Tirupur crime news today | తమిళనాడు తిరుప్పుర్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. డ్రైనేజ్​లో పడేసి ఉన్న సూట్​కేస్​లో ఓ మహిళ మృతదేహం కనిపించింది.

ఇదీ జరిగింది..

పుతునగర్​లోని నల్లూరు- ధరంపురం రోడ్డులో.. సోమవారం ఉదయం కొందరు మార్నింగ్​ వాక్​కు వెళ్లారు. ఆ ప్రాంతంలో ఉన్న డ్రేనేజ్​లో దుర్వాసన వస్తుండటంతో కొందరు దగ్గరికి వెళ్లిచూశారు. ఓ పెద్ద సూట్​కేస్​ వారికి కనిపించింది.

ఆ సూట్​కేస్​ను ఓపెన్​ చేసిన స్థానికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఓ మహళ మృతదేహం ఆ సూట్​కేస్​లో కనిపించడంతో షాక్​ అయ్యారు. ఈ విషయంపై వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. సూట్​కేస్​తో పాటు పరిసర ప్రాంతాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. మహిళ మెడపై గాట్లు ఉండటాన్ని గుర్తించారు. ఆమె గొంతనులిమి ఎవరో హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం కుళ్లిపోకపోవడంతో.. ఆదివారమే ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు.

ఆ మహిళ వివరాలను పోలీసులు కనుక్కోలేకపోయారు. కాగా ఆమెకు 25ఏళ్ల వయస్సు ఉంటుందని భావిస్తున్నారు. పోస్ట్​మార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసినట్టు, త్వరలోనే పట్టుకుంటామని అధికారులు వెల్లడించారు.

రూ. 100 కోసం గొడవ.. చివరికి!

Mumbai crime news | దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహారాష్ట్ర ముంబయిలో.. రూ. 100 కోసం గొడవ ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. అతడిని ఊపిరాడనివ్వకుండా చేసిన వ్యక్తి.. నేరాన్ని కప్పిపుచ్చేందుకు విఫలయత్నం చేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. 

దహిసర్​ ప్రాంతంలో కొకాట పరమేశ్వర్​, రాజు పాటిల్​లు పక్కపక్కన ఇళ్లల్లో నివాసముంటున్నారు. ఓ రోజు.. పరమేశ్వర్​ బంధువుకు రాజు పాటిల్​ రూ. 100 అప్పు ఇచ్చాడు. ఇదే విషయంపై శుక్రవారం పరమేశ్వర్​ ఇంటికి వెళ్లాడు పాటిల్​. తన 100 రూపాయలు తిరిగివ్వాలని అడిగాడు. కానీ పరమేశ్వర్​ ఇవ్వనని తేల్చిచెప్పేశాడు. దీంతో కోపం తెచ్చుకున్న పాటిల్​.. పరమేశ్వర్​ను అసభ్యకరంగా తిట్టడం మొదలుపెట్టాడు. వాగ్వాదం ముదిరి.. పాటిల్​పై పరమేశ్వర్​ దాడి చేశాడు. చివరికి ఊపిరాడనివ్వకుండా చేసి.. అతడిని చంపేశాడు.

ఆ తర్వాత.. చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు పరమేశ్వర్​. పాటిల్​ మృతదేహాన్ని ఓ దుప్పటికి చుట్టి.. నిప్పంటించాడు. 10నిమిషాల తర్వాత.. తన పొరుగింటి వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నాడని పోలీసులకు ఫోన్​ చేశాడు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. పాటిల్​ను ఆసుపత్రికి తరలించారు. కాగా అతను అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

మృతదేహానికి పోస్టుమార్టం చేసిన తర్వాత అసలు విషయం బయటపడింది. పాటిల్​ అనే వ్యక్తి.. కాలిన గాయాలతో మరణించలేదని, అతడిని ఎవరో ఊపిరాడనివ్వకుండా చేసి హతమార్చారని వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా.. పోలీసులు పరమేశ్వర్​ను అరెస్ట్​ చేశారు. విచారణలో భాగంగా.. చేసిన నేరాన్ని అతడు అంగీకరించాడు.

|#+|

 

 

 

 

తదుపరి వ్యాసం