Stock market | లాభాల్లో దేశీయ సూచీలు.. నిఫ్టీ@17,100
28 April 2022, 9:25 IST
- బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీలు గురువారం ట్రేడింగ్ను సానుకూలంగా ప్రారంభించాయి. కాగా.. ఏప్రిల్ ఎక్స్పైరీ కావడంతో ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
స్టాక్ మార్కెట్ ఇండియా
Stock market today | దేశీయ సూచీలు గురువారం సెషన్ను సానుకూలంగా ప్రారంభించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 264 పాయింట్లు వృద్ధి చెంది.. 57,083 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ.. 17,100 మార్కును అందుకుంది. ప్రస్తుతం 84 పాయింట్ల లాభంతో 17,122 వద్ద ట్రేడ్ అవుతోంది.
గత ట్రేడింగ్ సెషన్ను 56,819 వద్ద ముగించిన సెన్సెక్స్.. నేటి సెషన్ను 57,296 వద్ద ప్రారంభించింది. ఇక నిఫ్టీ గత సెషన్ను 17,038 వద్ద ముగించగా.. తాజాగా 17,189 వద్ద ఓపెన్ అయ్యింది.
కాగా.. సూచీలు సానుకూలంగానే ప్రారంభమైనప్పటికీ, ఏప్రిల్ ఎక్స్పైరీ కావడంతో గురువారం ట్రేడింగ్ సెషన్ ఒడుదొడుకుల్లో కొనసాగవచ్చని మార్కెట్ విశ్లేషణలు వెలువడుతున్నాయి.
లాభాలు.. నష్టాలు..
హెచ్యూఎల్, సన్ఫార్మా షేర్లు 2శాతం మేర లాభాలు గడించాయి. ఇండస్ఇండ్, డా. రెడ్డీస్, టాటా స్టీల్, ఎం అండ్ ఎం, ఇన్ఫోసిస్ షేర్లు 1శాతం మేర వృద్ధి చెందాయి.
హెచ్సీఎల్ టెక్, ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
టాపిక్