Presidential Elections : రాజేంద్ర ప్రసాద్ నుంచి కొవింద్ వరకు.. ఇవి మీకు తెలుసా?
17 July 2022, 19:10 IST
- Presidential Elections : రేపే రాష్ట్రపతి ఎన్నిక. మరి ఓసారి.. భారత ‘రాష్ట్రపతి’ చరిత్రను ఓసారి చూద్దామా..
రాజేంద్ర ప్రసాద్ నుంచి రామ్నాథ్ కొవింద్ వరకు.. (PTI)
రాజేంద్ర ప్రసాద్ నుంచి రామ్నాథ్ కొవింద్ వరకు..
Presidential Elections : రాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో భాగంగా.. సోమవారం రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కొవింద్ పదవీకాలం ముగియడంతో ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకు, విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు పోటీ నడుస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
ఈ నేపథ్యంలో 'రాష్ట్రపతి', 'రాష్ట్రపతి ఎన్నిక' చుట్టూ ఉన్న చరిత్రను ఓసారి పరిశీలిద్దాం..
భారత ‘రాష్ట్రపతి’ చరిత్ర..
- 1905లో భారత్.. గణతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఇప్పటి వరకు 14మంది రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. భారత తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్.. రెండుసార్లు ఆ పదవి చేపట్టారు.
- రాజేంద్ర ప్రసాద్.. 12ఏళ్ల 107రోజుల పాటు రాష్ట్రపతి భవన్లో ఉన్నారు. ఈ రికార్డ్ ఇప్పటికీ చెరగలేదు. 1952లో తొలిసారి, 1957లో రెండోసారి ఆయన రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు.
- ఇప్పటి వరకు 12మంది.. తమ 5ఏళ్ల పదవీకాలాన్ని పూర్తిచేసుకున్నారు. ఇద్దరు రాష్ట్రపతులు.. జాకిర్ హుసేన్, ఫక్రుద్దిన్ అలీ అహ్మెద్లు.. పదవిలో ఉండగానే మరణించారు. వీరిద్దరు.. మూడేళ్లు కూడా ఆ పదవిలో ఉండలేదు.
- 1969లో.. జాకిర్ హుసేన్ మరణాంతరం.. తాత్కాలిక రాష్ట్రపతిగా 35రోజుల పాటు బాధ్యతలు నిర్వహించారు అప్పటి చీఫ్ జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా. ఆ తర్వాత.. అప్పటి ఉపరాష్ట్రపతి వీవీ గిరి ఆ పదవిని చేపట్టారు. మూడు నెలల్లోనే ఆయన రాజీనామా చేసి.. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేశారు. మరోవైపు హిదాయతుల్లా.. 1979-1984 కాలంలో ఉపరాష్ట్రపతిగా పని చేశారు.
- ఫక్రుద్దిన్ మరణం అనంతరం.. 1977లో నాటి ఉపరాష్ట్రపతి బీడీ జట్టి తాత్కాలిక రాష్ట్రపతిగా నియమితులయ్యారు. ఐదు నెలల పాటు ఆ పదవిలో ఉన్నారు. ఆయన సమక్షంలోనే మొరార్జీ దేశాయ్.. ప్రధానిగా ప్రమాణం చేశారు.
- 1977లో ఎన్నికలు జరగకుండానే.. రాష్ట్రపతి పదవిని చేపట్టారు నీలం సంజీవ రెడ్డి. 36మంది నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురికావడమే ఇందుకు కారణం. 1969లో వీవీ గిరిపై పోటీకి నీలం సంజీవ రెడ్డిని బరిలో దింపింది కాంగ్రెస్. కొద్దిలో ఆయన ఓడిపోయారు.
- 1969 రాష్ట్రపతి ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఇందిరా గాంధీ మద్దతు ఉన్న నీలం సంజీవ రెడ్డి గెలుపు ఖాయం అని చాలా మంది భావించారు. కానీ స్వతంత్ర అభ్యర్థిగా నిలబడిన వీవీ గిరి అందరికి షాక్ ఇచ్చారు. కాంగ్రెస్లోని కొందరు చట్టసభ్యులు ఆయనకు మద్దతుగా నిలవడంతో గెలిచారు.
- ఉపరాష్ట్రపతిగా పని చేసి.. రాష్ట్రపతి పదవిని చేపట్టి తొలి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణ. 1962లో ఆయన రాష్ట్రపతి బాధ్యతలను స్వీకరించారు. ఆ తర్వాత జాకిర్ హుసేన్(1967), వీవీ గిరి(1969)లో ఈ ఘనత సాధించారు. మూడేళ్ల పాటు ఉపరాష్ట్రపతిగా పని చేసిన అనంతరం.. 1987లో రాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచారు ఆర్ వెంకటరామన్. అప్పుడు ఉపరాష్ట్రపతిగా పనిచేసిన శంకర్ దయాల్ శర్మ.. వెంకటరామన్ తర్వాత రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆయన హయాంలో ఉపరాష్ట్రపతిగా విధులు నిర్వహించిన కేఆర్ నారాయణ్.. 1997లో రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు.
- 1957 ఎన్నికల్లో గెలిచిన రాజేంద్ర ప్రసాద్కు 98.99శాతం ఓట్లు దక్కాయి. ఇప్పటికీ ఇదే అత్యధిక ఓట్ల శాతం. ఆ తర్వాత.. సర్వేపల్లి రాధాకృష్ణకు 98.25శాతం ఓట్లు దక్కాయి.
- ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కొవింద్.. 2017 జులై 25న ఆ పదవిని చేపట్టారు. ఉత్తర్ప్రదేశ్ నుంచి రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి వ్యక్తి ఆయనే.