తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ola | ఎలక్ట్రిక్​ వాహనాలకు మంటలు.. 'ఓలా' చర్యలు..!

Ola | ఎలక్ట్రిక్​ వాహనాలకు మంటలు.. 'ఓలా' చర్యలు..!

HT Telugu Desk HT Telugu

24 April 2022, 11:39 IST

    • ఢిల్లీ: ఓలా ఎలక్ట్రిక్​ కీలక నిర్ణయం తీసుకుంది. తాము రూపొందించిన 1,441 ఎలక్ట్రిక్​ వాహనాలను వెనక్కి పిలిపించనుంది. ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్​ వాహనాలకు మంటలు అంటుకుంటున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది.
ఆ వాహనాలను వెనక్కి పిలిపించిన ఓలా..!
ఆ వాహనాలను వెనక్కి పిలిపించిన ఓలా..! (HT AUTO)

ఆ వాహనాలను వెనక్కి పిలిపించిన ఓలా..!

EV fire incidents | ఎలక్ట్రిక్​ వాహనాలకు మంటలు అంటుకుంటున్న ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. ఆయా ఘటనల్లో పలువురు ప్రాణాలు సైతం కోల్పోయారు. తాజాగా.. ఈ వ్యవహారంపై ఓలా చర్యలు చేపట్టింది. తమ సంస్థ రూపొందించిన 1,441 ఎలక్ట్రిక్​ ద్విచక్ర వాహనాలను వెనక్కి పిలిపించనుంది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.

పుణెలో గత నెల 26న జరిగిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్​ వాహనాలను వెనక్కి తీసుకుంటున్నామని ఓలా ఎలక్ట్రిక్​ వెల్లడించింది.

"పుణెలోని ఓ ఎలక్ట్రిక్​ వాహనానికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. అయితే మా సంస్థ రూపొందించిన ఎలక్ట్రిక్​ వాహనం ప్రమాదానికి గురైన ఘటన ఇదొక్కటే అని తెలుస్తోంది. అయినప్పటికీ.. 1,441 వాహనాలను వెనక్కి పిలిపిస్తున్నాము. వాటి భద్రత, ఇతర ప్రమాణాలను మరోమారు పరిశీలిస్తాము. మా సర్వీసు ఇంజనీర్లు ఆ పని చూసుకుంటారు. బ్యాటరీ, థర్మల్​, సెఫ్టీ వ్యవస్థలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు," అని ఓలా ఎలక్ట్రిక్​ తెలిపింది.

Ola Electric | దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్​ వాహనాలకు నిప్పంటుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అనేక సంస్థలు తమ ఎలక్ట్రిక్​ వాహనాలను వెనక్కి పిలిపిస్తున్నాయి. ఒకినావా ఆటోటెక్​ సంస్థ.. ఇప్పటికే 3వేలకుపైగా యూనిట్లను వెనక్కి పిలిపించింది. ప్యూర్​ఈవీ సంస్థ సైతం 2వేలకుపైగా ఎలక్ట్రిక్​ వాహనాలను తిరిగి తీసేసుకుంది.

ఈ అగ్నిప్రమాదాలకు సంబంధించిన ఘటనలను ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించింది. వీటిపై ఓ ప్యానెల్​ను ఏర్పాటు చేసిన దర్యాప్తు చేపట్టింది. నిర్లక్ష్యం వహిస్తే.. వాహన తయారీ సంస్థలు భారీ మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరికలు జారీ చేసింది.

టాపిక్

తదుపరి వ్యాసం