Crime : ఏకంగా డీసీపీ ఇంటికే కన్నం వేసిన దొంగలు.. పోలీసులే షాక్!
26 July 2022, 6:34 IST
- దొంగలు.. ఏకంగా డీసీపీ ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డారు. రూ. లక్షలు విలువ చేసే బంగారం/ డైమండ్ ఆభరణాలను దోచుకుని పారిపోయారు.
ఏకంగా డీసీపీ ఇంటికే కన్నం వేసిన దొంగలు.. పోలీసులే షాక్!
దొంగలు ఏకంగా డిప్యూటీ కమిషనర్ ఇంటికే కన్నం వేశారు! రూ. లక్షలు విలువ చేసే బంగారం, డైమండ్ అభరణాలను దోచుకెళ్లిపోయారు. ఈ ఘటన ఛండీగఢ్లో జరిగింది.
ఎవరు లేని సమయంలో..
తర్న్తరన్ ప్రాంతం డీసీపీగా పనిచేస్తున్న మోనీష్ కుమార్, తన భార్య(ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారిణి)తో కలిసి సెక్టర్ 7లో నివాసముంటున్నారు. కాగా.. వారిద్దరు కలిసి ఈ నెల 19న పని మీద హైదరాబాద్కు వెళ్లారు. మళ్లీ ఈ నెల 24న ఛండీగఢ్కు చేరుకున్నారు.
అప్పుడే.. దొంగతనం గురించి.. డ్రైవర్, వారికి చెప్పాడు. దొంగలు.. ఇంటి మెయిన్ గేట్ లాక్ను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అల్మారా లాక్ను కూడా ధ్వంసం చేసి.. అనేక బంగారం, డైమండ్ ఆభరణాలను దోచుకుని వెళ్లిపోయారు.
10-12 బంగారం/డైమండ్ రింగ్లు, 10 గోల్డ్ ఛైన్లు, మూడు డైమెండ్ గాజులు, ఐదు బంగారం గాజులు, 20 వెండి కాయిన్లు, ఆరు బంగారం నాణెలు, డైమండ్ మంగళసూత్రం, నాలుగు వాచ్లు.. ఇంట్లో నుంచి మాయమైపోయాయి.
డీసీపీ ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.
కాగా.. డీసీపీ ఇంట్లోనే దొంగతనం జరగడంతో పోలీసులే షాక్కు గురయ్యారని తెలుస్తోంది.