తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime : ఏకంగా డీసీపీ ఇంటికే కన్నం వేసిన దొంగలు.. పోలీసులే షాక్​!

Crime : ఏకంగా డీసీపీ ఇంటికే కన్నం వేసిన దొంగలు.. పోలీసులే షాక్​!

Sharath Chitturi HT Telugu

26 July 2022, 6:34 IST

    • దొంగలు.. ఏకంగా డీసీపీ ఇంట్లోనే దొంగతనానికి పాల్పడ్డారు. రూ. లక్షలు విలువ చేసే బంగారం/ డైమండ్​ ఆభరణాలను దోచుకుని పారిపోయారు.
ఏకంగా డీసీపీ ఇంటికే కన్నం వేసిన దొంగలు.. పోలీసులే షాక్​!
ఏకంగా డీసీపీ ఇంటికే కన్నం వేసిన దొంగలు.. పోలీసులే షాక్​! (HT)

ఏకంగా డీసీపీ ఇంటికే కన్నం వేసిన దొంగలు.. పోలీసులే షాక్​!

దొంగలు ఏకంగా డిప్యూటీ కమిషనర్​ ఇంటికే కన్నం వేశారు! రూ. లక్షలు విలువ చేసే బంగారం, డైమండ్​ అభరణాలను దోచుకెళ్లిపోయారు. ఈ ఘటన ఛండీగఢ్​లో జరిగింది.

ఎవరు లేని సమయంలో..

తర్న్​తరన్​ ప్రాంతం డీసీపీగా పనిచేస్తున్న మోనీష్​ కుమార్​, తన భార్య(ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాధికారిణి)తో కలిసి సెక్టర్​ 7లో నివాసముంటున్నారు. కాగా.. వారిద్దరు కలిసి ఈ నెల 19న పని మీద హైదరాబాద్​కు వెళ్లారు. మళ్లీ ఈ నెల 24న ఛండీగఢ్​కు చేరుకున్నారు.

అప్పుడే.. దొంగతనం గురించి.. డ్రైవర్​, వారికి చెప్పాడు. దొంగలు.. ఇంటి మెయిన్​ గేట్​ లాక్​ను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అల్మారా లాక్​ను కూడా ధ్వంసం చేసి.. అనేక బంగారం, డైమండ్​ ఆభరణాలను దోచుకుని వెళ్లిపోయారు.

10-12 బంగారం/డైమండ్​ రింగ్​లు, 10 గోల్డ్​ ఛైన్​లు, మూడు డైమెండ్​ గాజులు, ఐదు బంగారం గాజులు, 20 వెండి కాయిన్లు, ఆరు బంగారం నాణెలు, డైమండ్​ మంగళసూత్రం, నాలుగు వాచ్​లు.. ఇంట్లో నుంచి మాయమైపోయాయి.

డీసీపీ ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.

కాగా.. డీసీపీ ఇంట్లోనే దొంగతనం జరగడంతో పోలీసులే షాక్​కు గురయ్యారని తెలుస్తోంది.

తదుపరి వ్యాసం