Man stabs friend to death : మంచి చెప్పిన స్నేహితుడిని కడతేర్చిన డ్రగ్స్ 'బానిస'!
08 October 2022, 7:03 IST
Man stabs friend to death : 'డ్రగ్స్ అలవాటు మానుకో..' అని స్నేహితుడికి చెప్పడమే అతడి తప్పు అయ్యింది! కోపంతో ఊగిపోయిన ఆ డ్రగ్స్ బానిస.. చివరికి మంచి చెబుతున్న స్నేహితుడినే చంపేశాడు. ఈ ఘటన హరియాణాల చోటుచేసుకుంది.
మంచి చెప్పిన స్నేహితుడిని కడతేర్చిన డ్రగ్స్ 'బానిస'
Man stabs friend to death : హరియాణా అంబాలాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మంచి చెప్పిన స్నేహితుడిని కడతేర్చాడు ఓ డ్రగ్స్ బానిస! డ్రగ్స్ వ్యామోహం విడిచిపెట్టాలని చెప్పడంతో కోపం తెచ్చుకున్న ఓ వ్యక్తి.. తన స్నేహితుడిని కత్తితో పొడిచి చంపేశాడు.
డ్రగ్స్ వద్దు రా.. అంటే..
23ఏళ్ల గౌరవ్, 26ఏళ్ల గుర్మీత్.. మంచి స్నేహితులు. ఇద్దరు కొన్నేళ్లుగా బిహ్త గ్రామంలో నివాసముంటున్నారు.
అయితే.. కొంతకాలంగా గుర్మీత్ డ్రగ్స్కు బానిస అయ్యాడు. అది చూసి స్నేహితుడు గౌరవ్ చాలా బాధపడ్డాడు. డ్రగ్స్ను విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేశాడు. ఎన్నో విధాలుగా చెప్పి చూశాడు. కానీ గుర్మీత్.. గౌరవ్ మాట వినలేదు. చెడు స్నేహంతో కలిసి డ్రగ్స్ తీసుకుంటూనే ఉన్నాడు. ఇదే విషయంపై స్నేహితుల మధ్య విపరీతమైన గొడవలు అయ్యేవి.
Ambala crime news : శుక్రవారం.. ఈ గొడవ మరింత తీవ్రమైంది. గుర్మీత్కు నచ్చజెప్పేందుకు గౌరవ్ మరోమారు ప్రయత్నించాడు. కానీ అది గుర్మీత్కు నచ్చలేదు. అంతే! కోపంతో ఊగిపోయిన గుర్మీత్.. కత్తితో గౌరవ్ను పొడిచి, పొడిచి చంపేశాడు.
"గుర్మీత్ డ్రగ్స్కు బానిస అవ్వడం గౌరవ్కు నచ్చలేదు. వదిలేయాలని చాలాసార్లు చెప్పి చూశాడు. కానీ గుర్మీత్ వదలలేదు. శుక్రవారం మధ్యాహ్నం.. రామ్దసియా చోపల్ ప్రాంతంలో భారీ అరుపులు వినిపించాయి. నేను వెళ్లి చూశాను. అదే సమయంలో గుర్మీత్.. తన పాకెట్లో నుంచి కత్తి తీసి గౌరవ్ను పొడిచాడు. పొడిచి పొడిచి చంపాడు. నేను పరిగెత్తడం చూసి, గుర్మీత్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు," అని గౌరవ్ సోదరుడు అంకిత్ పోలీసులకు వెల్లడించాడు.
Man kill friend : స్థానికులు గౌరవ్ను స్థానిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి అంబాలా కంటోన్మెంట్లోని సివిల్ హాస్పిటల్కి తరలించారు. అక్కడి నుంచి పీజీఐఎంఈఆర్కి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గౌరవ్ ప్రాణాలు కోల్పోయాడు.
అంకిత్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సాహా పోలీస్ స్టేషన్ పోలీసులు.. గుర్మీత్ను శుక్రవారం సాయంత్రం పట్టుకున్నారు. అరెస్ట్ చేసి విచారణను ముమ్మరం చేశారు.
కేసరి రైల్వే స్టేషన్కు సమీపంలో గుర్మీత్ని పట్టుకున్నట్టు పోలీసులు చెప్పారు. హత్యకు వాడిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. నిందితుడిని శనివారం కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.
పంజాబ్, హరియాణాల్లో డ్రగ్స్ వ్యవహారం చాలా ఆందోళనకరంగా ఉంది. డ్రగ్స్కు బానిసైన యువత గురించి తరచూ వార్తలు వస్తూనే ఉంటున్నాయి. దీనిపై తల్లిదండ్రులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కానీ వారి ఆవేదనకు ఫలితం ఉండటం లేదు.