Diabetes Patients Drinks : మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ పానీయాలు బెస్ట్
10 April 2023, 11:07 IST
- Diabetes Patients Drinks : ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎక్కువ. మన ఆహారం, జీవనశైలి ప్రభావం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు వంటి వ్యాధులు రోజురోజుకూ మనల్ని ప్రభావితం చేస్తున్నాయి. కొన్ని రకాల చిట్కాలను పాటించి.. కాస్త ఉపశమనం పొందొచ్చు.
పానియాలు
మధుమేహం(Diabetes)తో ఇండియాలో చాలా మంది బాధపడుతున్నారు. ఈ వ్యాధి ప్రారంభమైతే, వైద్యుడిని సంప్రదించి మందులు తీసుకోండి. అయితే కొన్ని ఆహార నియమాలను(Food Habits) పాటించడం ద్వారా సహజంగా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. శరీరంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకుంటే మధుమేహం పెద్ద సమస్య కాదు. కొన్ని రకాల పానీయాలు తీసుకుంటే చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు.
కాకరకాయ జ్యూస్
మధుమేహ వ్యాధిగ్రస్తులకు కాకరకాయ రసం(bitter gourd juice) ఉత్తమమైన పానీయం. ఇది సహజంగా శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ను సక్రియం చేస్తుంది. ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరం చక్కెరను తగినంతగా ఉపయోగించుకుంటుంది. చక్కెరను కొవ్వుగా మార్చదు. బరువు తగ్గడం(Weight Loss)లో కాకర జ్యూస్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించే చరాంటిన్ అనే ఏజెంట్ను సక్రియం చేస్తుంది. ఇది శరీరంలో చక్కెర స్థాయిని ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేస్తుంది.
మెంతి నీరు
మధుమేహాన్ని సహజసిద్ధంగా నియంత్రించేందుకు మెంతి నీరు(Fenugreek Water) ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్(type 2 diabetes)ఉన్నవారికి మెంతి గింజల నీరు తాగడం మంచిది. 10 గ్రాముల మెంతి గింజలను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగితే శరీరంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. శరీరంలో కార్బోహైడ్రేట్లు మరియు చక్కెర స్థాయిలను గ్రహించడంలో సహాయపడుతుంది. శరీరంలో చక్కెరను సక్రమంగా వినియోగించుకోవడానికి కూడా మెంతి నీరు ఉపయోగపడుతుంది.
బార్లీ నీరు
బార్లీలో నీటి(Barley Water)లో కరగని ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు బార్లీ నీటిని తాగడం చాలా మంచిది.
చియా సీడ్ వాటర్
మీరు చియా విత్తనాలను మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. చియా గింజలను నీటిలో లేదా పాలలో నానబెట్టి తర్వాత తాగితే మంచిది. ఉదయం అల్పాహారం తర్వాత చియా సీడ్ వాటర్ తాగండి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది అలాగే రక్త స్థాయిలను నియంత్రిస్తుంది.
చమోమిలే టీ
ఇది డయాబెటిస్కే కాకుండా వివిధ దీర్ఘకాలిక వ్యాధులకు కూడా దివ్యౌషధం. ఇది యాంటీఆక్సిడెంట్, క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంది. శరీరంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది. రోజూ క్రమం తప్పకుండా చమోమిలే టీ(Chamomile Tea) తాగితే, శరీరంలో ఇన్సులిన్ పరిమాణం సాధారణంగా ఉంటుంది. మీరు నిమ్మరసంతో చమోమిలే టీని త్రాగవచ్చు.
కూరగాయల రసం
ఆకుకూరలు, ముల్లంగి తదితర కూరగాయల జ్యూస్ని తయారు చేసి తాగవచ్చు. తక్కువ షుగర్ ఉన్న కూరగాయల నుండి జ్యూస్ని రెగ్యులర్గా తీసుకుంటే షుగర్ లెవెల్(Sugar Level) అదుపులోకి వస్తుంది. అటువంటి కూరగాయల రసం తీసుకునేటప్పుడు, చక్కెరను ఉపయోగించవద్దు. కొంచెం ఉప్పు లేదా నిమ్మరసం పిండడం మంచిది.
మూలికల టీ
హెర్బల్ టీ(Herbal Tea) లేదా గ్రీన్ టీని రెగ్యులర్ గా తీసుకోవచ్చు. ఇది చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. మీరు భోజనం లేదా అల్పాహారం తర్వాత అర కప్పు హెర్బల్ టీని తాగితే, ఇన్సులిన్ స్థాయి మెరుగుపడుతుంది. మందార, అల్లం పుదీనా, ఇవి ఉన్న హెర్బల్ టీ తాగడం మధుమేహానికి మంచిది.
గ్రీన్ స్మూతీస్
వేసవిలో కూడా గ్రీన్ స్మూతీలు మంచివి. పాలక్, చేదు వంటి కూరగాయలతో చేసిన స్మూతీలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ స్మూతీలను ప్రొటీన్ పౌడర్, కొన్ని పండ్లతో కలిపి తీసుకోవచ్చు. వీటితో పాటు షుగర్ ఫ్రీ నిమ్మరసం, తక్కువ కొవ్వు పాలు, పచ్చి కూరగాయలతో మంచి ఆహారం తీసుకుంటే మధుమేహం సులభంగా అదుపులో ఉంటుంది.