తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  1 Rupee Ticket : కేవలం ఒక్క రూపాయికే సినిమా టికెట్.. ఏది? ఎప్పుడు?

1 Rupee Ticket : కేవలం ఒక్క రూపాయికే సినిమా టికెట్.. ఏది? ఎప్పుడు?

Anand Sai HT Telugu

30 May 2023, 12:14 IST

    • 1 Rupee Movie : సినిమా చూడాలంటే.. వందో, రెండు వందల రూపాయలో ఖర్చు అవుతుంది. కుటుంబం అంతా కలిసి వెళ్తే.. చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. కానీ ఒక్కరూపాయితో సినిమా చూడొచ్చు. ఏ సినిమానో తెలుసా?
యాదా యదా హి
యాదా యదా హి (Twitter)

యాదా యదా హి

ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. సెలబ్రిటీలను షోకు పిలవడం, సినిమా(Cinema) చూసిన వారికి బహుమతులు ఇవ్వడం, అతి తక్కువ ధరకు సినిమాను ప్రదర్శించడం.. ఇలా అన్నీ ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నాలే. కొన్నిసార్లు హీరోలు ప్రజల్లోకి వెళ్లి తమ సినిమాను చూసేలా ప్రమోట్ చేస్తారు. మరికొన్ని సార్లు టికెట్ ధర తగ్గిస్తారు. ఆ మధ్య కాలంలో కన్నడలో కొత్తగా వచ్చిన 'డేర్ డెవిల్ ముస్తఫా' సినిమా చూసిన వారికి వంద రూపాయల క్యాష్‌బ్యాక్(Cash back) ప్రకటించారు. ఇప్పుడు కేవలం ఒక్క రూపాయి టిక్కెట్(1 Rupee Ticket) ధరతో కొత్త సినిమా చూపించనున్నారు. కానీ పరిమిత కాలానికి మాత్రమే.

ట్రెండింగ్ వార్తలు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

Korean Movies in Cannes: కేన్స్‌లో దుమ్ము రేపిన ఈ కొరియన్ సినిమాలను ఏ ఓటీటీల్లో చూడాలంటే..

Love Me Trailer: భయపెడుతున్న వైష్ణవి చైతన్య లవ్ మి ట్రైలర్.. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు?

Lampan OTT: బాల్యాన్ని గుర్తుచేసేలా ఉన్న వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.. ఏ ప్లాట్‍ఫామ్‍లో చూడొచ్చంటే..

మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన కన్నడ చిత్రం 'యాదా యాదా హి'(Yadha Yadha HI) ఈ శుక్రవారం గ్రాండ్‌గా విడుదల కానుంది. తెలుగు సినిమాల్లోనూ నటించిన వశిష్ఠ సింహ(Vashista Simha), హరిప్రియ కలిసి తెరపై కనిపించిన ఈ సినిమా కాస్త క్యూరియాసిటీని పెంచింది. హరిప్రియ నెగెటివ్ షేడ్ పాత్రలో కనిపించడమే కాకుండా సినిమా ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఇన్ని విశేషాలతో కూడిన ఈ సినిమా ప్రీమియర్ షోను కేవలం ఒక్క రూపాయిలోనే చూడొచ్చు.

మే 31వ తేదీ బుధవారం సాయంత్రం జరగనున్న యాదా యాదా హి ప్రీమియర్ షోను బెంగుళూరులోని వీరేష్ సినిమాస్, హుబ్బళ్లిలోని సుధా సినిమాల్లో రూ.1తో చూసేందుకు ఛాన్స్ ఇచ్చారు. కన్నడ చిత్ర పరిశ్రమలో ఇలాంటి విభిన్నమైన ప్రయత్నం జరగడం ఇదే తొలిసారి.

షాలిని ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా జాక్‌ మంజు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ సాంగ్ ను వశిష్ఠసింహ, హరిప్రియ పాడారు. తెలుగు మూలానికి చెందిన అశోక తేజ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గైస్ అండ్ డాల్స్ క్రియేషన్స్ ద్వారా హైదరాబాద్‌(Hyderabad)కు చెందిన రాజేష్ అగర్వాల్ నిర్మించారు. మర్డర్ మిస్టరీ కథ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఈ సినిమాలో నటించడానికి ముందు హరిప్రియ, వశిష్ఠసింహ స్నేహితులు. నటిస్తూనే ప్రేమికులుగా మారారు. విడుదల సమయానికి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఐతే ఈ సినిమా ఇద్దరికీ చాలా స్పెషల్ మూవీ.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం