తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Telugu Serial Actresses Remuneration: తెలుగు సీరియల్స్‌లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునేది వీళ్లే

Telugu Serial Actresses Remuneration: తెలుగు సీరియల్స్‌లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునేది వీళ్లే

Hari Prasad S HT Telugu

17 March 2023, 10:10 IST

    • Telugu Serial Actress Remuneration: తెలుగు సీరియల్స్‌లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునేది ఎవరో తెలుసా? తెలుగు రాష్ట్రాల్లో సినిమా నటులకు సమానంగా క్రేజ్ సంపాదిస్తున్న ఈ నటీమణులు.. బుల్లితెర మహరాణులుగా వెలుగొందుతున్నారు.
కార్తీక దీపం సీరియల్ తో పాపులర్ అయిన ప్రేమి విశ్వనాథ్
కార్తీక దీపం సీరియల్ తో పాపులర్ అయిన ప్రేమి విశ్వనాథ్

కార్తీక దీపం సీరియల్ తో పాపులర్ అయిన ప్రేమి విశ్వనాథ్

Telugu Serial Actress Remuneration: తెలుగులో టీవీ సీరియల్స్ కు ఉండే క్రేజ్ ఎలాంటిదో తెలుసు కదా. సీరియల్స్ కు, ఇందులో నటించే వాళ్లకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఈ సీరియల్స్ ను ఎక్కువగా ఫాలో అయ్యేది ఆడవాళ్లు కావడంతో ఇందులో కనిపించే నటీమణులకు క్రేజ్ ఎక్కువే. అందుకు తగినట్లే వాళ్లు కూడా రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Srikanth on Rave Party: మొన్న నా భార్యతో విడాకులు ఇప్పించేశారు.. ఇప్పుడిలా.. వాడెవడో నాలాగే ఉన్నాడు కానీ..: శ్రీకాంత్

Deepika Padukone Baby Bump: దీపికా బేబీ బంప్.. భర్తతో కలిసి ఓటేయడానికి వస్తూ చూపించిన బ్యూటీ

Laapataa Ladies: అందరినీ ఆలోచింపజేసేలా మంజూ మాయ్ చెప్పిన పవర్‌ఫుల్ హార్డ్ హిట్టింగ్ డైలాగ్స్ ఇవి.. మిస్ అవకండి

Devara Fear Song Lyrics: దేవర మూవీ ఫియర్ సాంగ్ లిరిక్స్ ఇవే.. అదరగొడుతున్న అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్

తెలుగు సీరియల్స్ లో నటించే వాళ్లలో ఒక రోజుకు ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో ఒకసారి చూద్దాం. ఈ లిస్టులో కార్తీకదీపం ఫేమ్ ప్రేమి విశ్వనాథ్ టాప్ లో ఉంది. ఆరేళ్లుగా ఈ సీరియల్ లో నటించిన ఆమె.. రోజుకు అత్యధికంగా రూ.30 వేల వరకూ అందుకుంటోంది.

ఇక ఆమె తర్వాతి స్థానం సుజితది. రెండు దశాబ్దాలకుగాపై అటు సినిమాలు, ఇటు సీరియల్స్ లో నటిస్తూ అలరిస్తున్న సుజిత్.. ప్రస్తుతం రోజుకు రూ.25 వేల వరకూ అందుకుంటున్నట్లు సమాచారం. ఆమె ప్రస్తుతం స్టార్ మాలో వస్తున్న మౌనరాగం, జెమినిలో వస్తున్న గీతాంజలి సీరియల్స్ లో నటిస్తోంది.

సుజితతో సమానంగా కస్తూరి శంకర్, రాశి, సుహాసిని కూడా రోజుకు రూ.25 వేల వరకూ అందుకుంటున్నారు. గృహలక్ష్మి సీరియల్ లో తులసి పాత్రతో పాపులరైంది కస్తూరి శంకర్. ఇక 20 ఏళ్ల కిందట సినిమాల్లో అడుగుపెట్టి తర్వాత సీరియల్స్ లోకి వచ్చిన సుహాసిని కూడా అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే వారిలో రెండోస్థానంలో కొనసాగుతోంది.

మేఘనా లోకేష్, నవ్య స్వామి, ఐశ్వర్యలాంటి సీరియల్స్ లో నటించే వాళ్లు రోజుకు రూ.20 వేల రెమ్యునరేషన్ వసూలు చేస్తున్నారు. వీళ్ల తర్వాత అర్చన అనంత్, శోభా శెట్టి, అనిలా శ్రీకుమార్ రూ.15 వేలు తీసుకుంటున్నారు. సుదీర్ఘకాలంగా పాటు సాగే సీరియల్స్ లో రోజకు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అంటే చాలా ఎక్కువే.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం