తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Adrishyam Tv Series: ఓటీటీలోకి స్పై థ్రిల్లర్ టీవీ సిరీస్ అదృశ్యం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడాలంటే?

Adrishyam TV Series: ఓటీటీలోకి స్పై థ్రిల్లర్ టీవీ సిరీస్ అదృశ్యం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu

19 March 2024, 12:34 IST

    • Adrishyam TV Series: ఓటీటీలోకి మరో స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. ఈ సిరీస్ పేరు అదృశ్యం - ది ఇన్విన్సిబుల్ హీరోస్. ఈ కొత్త వెబ్ సిరీస్ త్వరలోనే సోనీలివ్ ఓటీటీలోకి రానుంది.
ఓటీటీలోకి స్పై థ్రిల్లర్ టీవీ సిరీస్ అదృశ్యం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి స్పై థ్రిల్లర్ టీవీ సిరీస్ అదృశ్యం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడాలంటే?

ఓటీటీలోకి స్పై థ్రిల్లర్ టీవీ సిరీస్ అదృశ్యం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. ఎక్కడ చూడాలంటే?

Adrishyam TV Series: ఓటీటీల్లో మరో ఎక్సైటింగ్ స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ రానుంది. ఈ కొత్త సిరీస్ స్ట్రీమింగ్ తేదీని సోమవారం (మార్చి 18) సోనీలివ్ ఓటీటీ వెల్లడించింది. అదృశ్యం-ది ఇన్విన్సిబుల్ హీరోస్ అనే ఈ సిరీస్ నుంచి గతంలోనే టీజర్ రాగా.. తాజాగా మరో వీడియోతో స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేశారు. టీజరే కాదు.. ఇప్పుడీ వీడియో కూడా సిరీస్ పై అంచనాలను పెంచేసింది.

ట్రెండింగ్ వార్తలు

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అదృశ్యం సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఇండియాలోని ప్రముఖ ఓటీటీల్లో ఒకటైన సోనీలివ్ నుంచి వస్తున్న వెబ్ సిరీస్ అదృశ్యం-ది ఇన్విన్సిబుల్ హీరోస్. సాధారణ ప్రజల కంటికి కనిపించకుండా వాళ్లను సురక్షితంగా ఉంచే గూఢచారుల స్టోరీయే ఈ అదృశ్యం. ఈ కొత్త స్పై థ్రిల్లర్ సిరీస్ ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సోనీలివ్ వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ వీడియో రిలీజ్ చేసింది.

ఈ అదృశ్యం సిరీస్ లో ఐజాజ్ ఖాన్, దివ్యాంకా త్రిపాఠీ దహియా లీడ్ రోల్స్ లో నటించారు. ఈ ఏడాది మొదట్లోనే సిరీస్ టీజర్ రిలీజ్ కాగా.. తాజాగా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ఓ మహిళ తన కూతురితో కలిసి ఓ షాపింగ్ మాల్ లో షాపింగ్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఓ మోస్ట్ వాంటెట్ క్రిమినల్ అక్కడికి వస్తాడు.

తాను డ్రెస్ ట్రయల్ చేసి చూస్తానంటూ లోపలికి వెళ్లిన ఆమె.. పక్కనే ఉన్న మరో ట్రయల్ రూమ్ లో ఉన్న ఆ వ్యక్తిపై అటాక్ చేస్తుంది. ఈ సందర్భంగా ఆమె స్టంట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సీన్ చూసిన ఫ్యాన్స్ ఈ టీవీ సిరీస్ కోసం మరింత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్ లో దివ్యాంకా త్రిపాఠీ.. పార్వతి సెహగల్ అనే పోలీస్ అధికారి పాత్ర పోషిస్తోంది.

ఈ అదృశ్యం సిరీస్ ఏప్రిల్ 11 నుంచి ప్రతి గురు, శుక్రవారాల్లో రాత్రి 8 గంటలకు సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అన్షుమన్ కిశోర్ సింగ్ ఈ సిరీస్ ను డైరెక్ట్ చేశాడు. ఈ హిందీ సిరీస్ ట్రైలర్ చూస్తుంటే.. అభిమానులను ఆకట్టుకునేలానే ఉంది.

సోనీలివ్ షోస్, మూవీస్ ఇవే

సోనీలివ్ ఓటీటీలో ఇప్పటికే పలు వెబ్ సిరీస్, మూవీస్ ఉన్నాయి. ఈ ఓటీటీ నుంచి వచ్చిన స్కామ్ 1992, స్కామ్ 2003, మహారాణి, రాకెట్ బాయ్స్, గర్మీ, ఛార్లీ చోప్రా, ఛమక్, కఫస్ లాంటి వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇవే కాకుండా ఈ మధ్యే మలయాళ సూపర్ డూపర్ హిట్ మూవీ భ్రమయుగం కూడా ఇదే ఓటీటీలోకి వచ్చింది.

ఈ సోనీలివ్ ఓటీటీ వివిధ సబ్‌స్క్రిప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ ఓటీటీని నెలకు రూ.299, ఆరు నెలలకు రూ.699, ఏడాదికి రూ.999లతో సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. కేవలం మొబైల్ లోనే కావాలంటే ఏడాదికి రూ.599 చెల్లిస్తే సరిపోతుంది. ఓటీటీ ప్లే ద్వారా కూడా సోనీలివ్ ఓటీటీ చూసే అవకాశం ఉంటుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం