తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pushpa 2: పుష్ప 2లో ఈ బాలీవుడ్ భామ చిందేయనుందా?

Pushpa 2: పుష్ప 2లో ఈ బాలీవుడ్ భామ చిందేయనుందా?

13 February 2024, 15:08 IST

    • Allu Arjun Pushpa 2 The Rule: పుష్ప 2 సినిమా స్పెషల్ సాంగ్‍లో ఓ బాలీవుడ్ నటి చిందేయనున్నారని రూమర్లు బయటికి వస్తున్నాయి. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో స్పెషల్ సాంగ్‍పై చాలా ఫోకస్ ఉంది.
Pushpa 2: పుష్ప 2లో ఈ బాలీవుడ్ భామ చిందేయనుందా?
Pushpa 2: పుష్ప 2లో ఈ బాలీవుడ్ భామ చిందేయనుందా?

Pushpa 2: పుష్ప 2లో ఈ బాలీవుడ్ భామ చిందేయనుందా?

Pushpa 2 The Rule: పుష్ప 2: ది రూల్ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో.. హిందీ జనాల్లోనూ అంతే ఆసక్తి ఉంది. 2021లో వచ్చిన పుష్ప చిత్రం తెలుగుతో పాటు హిందీలోనూ బ్లాక్‍బాస్టర్ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ హీరో అయ్యారు. సుకుమార్ దర్శకత్వంలో ఆ చిత్రానికి సీక్వెల్‍గా రానున్న ‘పుష్ప 2: ది రూల్’పై అంచనాలు ఓ రేంజ్‍లో ఉన్నాయి. అయితే, సినిమాలో స్పెషల్ సాంగ్‍పై కూడా చాలా ఆసక్తి ఉంది.

ట్రెండింగ్ వార్తలు

Sudheer Babu: సుధీర్ బాబుకు బర్త్ డే విషెస్.. హరోం హర నుంచి కొత్త సాంగ్ రిలీజ్

Aarambham OTT: ఓటీటీల్లో వెతికి మరీ చూస్తారు.. అప్పటివరకు ఆగొద్దు: ఆరంభం డైరెక్టర్ అజయ్ నాగ్

Aavesham OTT Controversy: ప్రేక్షకులను బాధపెట్టిన ఓటీటీ మూవీ ఆవేశం.. భాషను అవమానించారంటూ ఫైర్

Brahmamudi: కావ్య మాటలకు ఖంగుతిన్న మామ సుభాష్- రాజ్‌తో సవాల్- శైలేంద్రకు తండ్రి వార్నింగ్- బయటపడనున్న మీరా ప్రెగ్నెన్సీ

పుష్ప 1లో ‘ఊ అంటారా’ స్పెషల్ సాంగ్‍లో స్టార్ హీరోయిన్ సమంత చిందేశారు. ఆ స్పెషల్ సాంగ్ తెలుగుతో పాటు రిలీజైన అన్ని భాషల్లో ఓ ఊపుఊపేసింది. సమంత డ్యాన్స్, గ్రేస్ అదిరిపోయాయి. దీంతో ‘పుష్ప 2: ది రూల్’ స్పెషల్ సాంగ్‍లో ఏ నటి ఉంటారోనన్న ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో కొందరి పేర్లు వినిపించాయి. అయితే, ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ భామ దిశా పటానీని మూవీ టీమ్ ఫిక్స్ చేసిందని తాజాగా రూమర్లు బయటికి వచ్చాయి.

పుష్ప 2 చిత్రంలో దిశా పటానీ స్పెషల్ సాంగ్ చేయనున్నారని గ్రేప్‍వైన్ రిపోర్ట్ వెల్లడించింది. ఇప్పటికే ఈ పాట కోసం ఆమె సైన్ కూడా చేశారని పేర్కొంది. త్వరలోనే షూటింగ్‍లో పాల్గొంటారని తెలిపింది. అయితే, ఈ విషయంపై మూవీ టీమ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అప్పుడే ఈ రూమర్‌పై క్లారిటీ వస్తుంది. 

పుష్ప 2లో స్పెషల్ సాంగ్ కోసం హీరోయిన్ శ్రీలీలతోనూ టీమ్ చర్చలు జరిపిందని గతంలో రూమర్లు వచ్చాయి. అయితే, ఈ పాట కోసం ఆమె రూ.2కోట్ల రెమ్యూనరేషన్ అడిగారని కూడా ఊహాగానాలు వినిపించాయి. అయితే, చివరికి బాలీవుడ్‍లో ఫేమ్ ఉన్న దిశా పటానీనే స్పెషల్ సాంగ్ కోసం సుకుమార్ సెలెక్ట్ చేశారని టాక్.

రిలీజ్ విషయంలో సందిగ్ధత

పుష్ప 2: ది రూల్’ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ అవుతుందని మూవీ టీమ్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ చిత్రం వాయిదా పడుతుందని కొన్నిసార్లు పుకార్లు వచ్చాయి. అయితే, అనుకున్న సమయానికే రిలీజ్ చేస్తామని టీమ్ చెబుతూనే ఉంది. అయినా షూటింగ్ చాలా పెండింగ్‍లో ఉండటంతో ఇంకా సందిగ్ధత నెలకొన్నట్టు వార్తలు వస్తున్నాయి.

కాగా, ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ఓటీటీ హక్కులను భారీ ధరకు నెట్‍ఫ్లిక్స్ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఆ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుంది. సుమారు రూ.100కోట్లకు స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ దక్కించుకుందని సమాచారం బయటికి వచ్చింది.

పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఫాహద్ ఫాజిల్, జగదీశ్ ప్రతాప్ బండారీ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ కీలకపాత్రలో పోషించారు. ఈ మూవీకి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించనున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం