Prabhas | సలార్ సెట్స్ లో ప్రభాస్ తిరిగి అడుగుపెట్టేది ఎప్పుడంటే...
16 May 2022, 9:12 IST
ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ చిత్రం షూటింగ్ తిరిగి మొదలుకాబోతున్నది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఎప్పటి నుంచి మొదలుకానుందంటే....
ప్రభాస్
సలార్ షూటింగ్ సెట్స్ లో తిరిగి అడుగుపెట్టబోతున్నారు ప్రభాస్. రెండు నెలల విరామం తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. గ్యాంగ్ స్టర్ కథాంశంతో పవర్ఫుల్యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
ఏప్రిల్ 14న కేజీఎఫ్ 2 విడుదలకావడంతో ఈసినిమా ప్రమోషన్స్ కారణంగా సలార్ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్ నీల్. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టించింది ఈ చిత్రం. 1200 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమా అద్వితీయ విజయంతో ఫుల్ జోష్ తో సలార్ షూటింగ్ను మొదలుపెట్టేందుకు ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నారు.
మే 17 నుండి ఈ సినిమా తాజా షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. మంగళవారం నుంచి మొదలయ్యే ఈ షెడ్యూల్లో ప్రభాస్ తో పాటు ప్రధాన తారాగణంపై ప్రశాంత్ నీల్ కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు చెబుతున్నారు. ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్ లో భారీ సెట్ ను ప్రత్యేకంగా వేసినట్లు చెబుతున్నారు.
దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ తో కేజీఎఫ్ నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు.
టాపిక్