Pooja Hegde: మహేశ్-త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీలో పూజానే హీరోయిన్.. రూమర్లకు చెక్
07 July 2022, 18:41 IST
- మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న మూడో సినిమాలో పూజా హెగ్డేనే హీరోయిన్గా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆమెను ఆ ప్రాజెక్టు నుంచి తొలగించారనడంలో నిజం లేదని సమాచారం.
పూజా హెగ్డే
పూజా హెగ్డే.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ డేట్స్ కోసం పెద్ద దర్శకులు, నిర్మాతలు క్యూ కడుతున్నారు. తెలుగు, తమిళం, హిందీలో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. వరుస పెట్టి స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. భాషతో సంబంధం లేకుండా మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అందుకే త్రివిక్రమ్-మహేశ్ బాబు కాంబినేషన్లో రానున్న మూడో సినిమలోనూ హీరోయిన్గా పూజాను ఎంపిక చేశారు. అయితే వరుస పెట్టి ఈ భామకు ఫ్లాపులు పలకరించడంతో ఆమెను ప్రాజెక్టు నుంచి తప్పించారని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ రూమర్లలో ఎలాంటి నిజం లేదట. ఈ సినిమాలో ఆమెనే హీరోయిన్గా ఎంపిక చేశారట.
ఈ ఏడాది పూజా నటించిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు ఫ్లాపయ్యాయి. ఇంత భారీ బడ్జెట్తో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టడంచో బుట్టబొమ్మను ఐరెన్ లెగ్గా భావించారు మహేశ్ బాబు అభిమానులు. దీంతో త్రివిక్రమ్ కాంబోలో రానున్న సినిమా నుంచి పూజా హెగ్డేను తీసుకోవద్దని ట్విటర్ వేదికగా సూపర్ స్టార్ అభిమానులు కోరారు. ఫలితంగా ఆమెను ఈ ప్రాజెక్టు నుంచి తప్పించారని వార్తలు వచ్చాయి. అయితే వీటిలో నిజం లేదని తెలుస్తోంది.
పూజా హెగ్డేను తొలగించకపోవడానికి కారణం త్రివిక్రమేనట. ఆయన దర్శకత్వంలో మన బుట్ట బొమ్మ అరవింద సమేత, అల వైకుంఠపురములో లాంటి సినిమాల్లో నటించింది. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ కావడంతో మహేశ్తో సినిమాలో మన గురూజీ.. పూజా హెగ్డేనే కావాలని పట్టుబట్టాడట. ఏదో ఆమె నటించిన రెండు, మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయని.. తన సినిమా నుంచి తొలగించడం సరికాదని ఆయన భావించాడట.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్రివిక్రమ్ దగ్గరుండి ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో ఈ చిత్రానికి సంబంధించిన సెట్స్ సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుందీ చిత్రం. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశముంది.
టాపిక్