తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ravi Teja | టైగర్ నాగేశ్వరరావుకు హీరోయిన్ దొరికింది.. స్టార్ హీరోయిన్‌కు సోదరి

Ravi Teja | టైగర్ నాగేశ్వరరావుకు హీరోయిన్ దొరికింది.. స్టార్ హీరోయిన్‌కు సోదరి

HT Telugu Desk HT Telugu

31 March 2022, 20:41 IST

    • రవితేజ హీరోగా రూపొందిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్ర హీరోయిన్ కన్ఫార్మ్ అయింది. బాలీవుడ్ నటి కృతి సనన్ చెల్లెలు నురుప్ సనన్‌ను ఇందులో హీరోయిన్‌గా చేయనుంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.
రవితేజ సరసన నుపుర్ సనన్
రవితేజ సరసన నుపుర్ సనన్ (Twitter)

రవితేజ సరసన నుపుర్ సనన్

మాస్ మహారాజ రవితేజ వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన మరో ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడు. అదే టైగర్ నాగేశ్వరారవు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది. ఉగాది సందర్భంగా ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని ఘనంగా ప్రారంభించనుంది చిత్రబృందం. ఈ చిత్రానికి ది కశ్మీర్ ఫైల్స్ సినిమా నిర్మించిన అభిషేక్ అగర్వాల్ నిర్మాత. బాలీవుడ్‌లో తొలి సినిమాతోనే రూ.200 కోట్ల వసూళ్లు సాధించిన ఈయనకు ఇది డ్రీమ్ ప్రాజెక్ట్. తాజాగా టైగర్ నాగేశ్వరారవు చిత్రంలో హీరోయిన్‌ను ఫైనల్ చేసింది చిత్రబృందం.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హీరోయిన్‌గా నుపుర్ సనన్‌ను తీసుకున్నారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న కృతిసనన్ సోదరీయే ఈ నుపుర్. కృతి కూడా తెలుగు చిత్రంతోనే తన సినీ రంగ ప్రవేశం చేసింది. ఇప్పుడు తన సోదరి కూడా తెలుగు చిత్రంతోనే అరంగేట్రం చేయనుండటం విశేషం.

టైగర్ నాగేశ్వరరావు సినిమా వాస్తవికంగా జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. 1970వ దశకంలో తెలుగు రాష్ట్రాలను వణికించిన దొంగ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. రవితేజ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాకు వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు ఈ దర్శకుడు దొంగాట, కిట్టూ ఉన్నాడు జాగ్రత్త లాంటి విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఉగాది రోజు ఈ చిత్రాన్ని ప్రారంభించనున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం