తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Janhvi In Ntr30: ఎన్టీఆర్ 30లో హీరోయిన్ ఫిక్స్.. కథానాయికగా శ్రీదేవి ముద్దుల తనయ

Janhvi in NTR30: ఎన్టీఆర్ 30లో హీరోయిన్ ఫిక్స్.. కథానాయికగా శ్రీదేవి ముద్దుల తనయ

06 March 2023, 12:20 IST

    • Janhvi in NTR30: కొరటాల శివ-జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో NTR 30 అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ను ఎంపిక చేశారు. ఈ రోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్ హీరోయిన్
ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్ హీరోయిన్

ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్ హీరోయిన్

Janhvi in NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. గతేడాది కాలంగా ఈ చిత్రంలో హీరయిన్ ఎవరు అనే అంశం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరో ప్రకటించేసింది చిత్రబృందం. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో కథనాయికగా జాన్వీ కపూర్‌ కనిపించనుందని ప్రకటించింది. అందరూ అనుుకున్నట్లే జాన్వీని ఎంపిక చేసి అభిమానులను శుభవార్త చెప్పింది. అంతేకాకుండా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Scam 2010 Web Series: స్కామ్ 2010.. మరో వెబ్ సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. ఈసారి సుబ్రతా రాయ్ స్కామ్

Jayanthi Kannappan: కొడుకు మృతితో బాధ.. ఇద్దరి మధ్య దూరం: లలితతో ప్రకాశ్ రాజ్ విడాకులపై జయంతి కన్నప్పన్ వ్యాఖ్యలు

Janhvi Kapoor: ఎంఎస్ ధోనీ ఫిలాసఫీ మా సినిమాలో ఉంటుంది: జాన్వీ కపూర్

Aranmanai 4 - Rathnam OTT: ఒకే రోజు ఓటీటీలోకి త‌మ‌న్నా అరాణ్మ‌ణై 4...విశాల్ ర‌త్నం - ట్విస్ట్ ఏంటంటే?

"జాన్వీ కపూర్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం నాడు ఈ విషయాన్ని మేకర్స్ తెలియజేశారు. NTR30 భయంకరమైన ప్రపంచం నుంచి తుఫానులో ప్రశాంతత ఆమె వచ్చింది. జాన్వీ కపూర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు" అని చిత్ర నిర్మాణ సంస్థ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్విటర్ వేదికగా తెలియజేసింది.

NTR30లో భాగం కావడంపై జాన్వీ కపూర్ కూడా ఆనందం వ్యక్తం చేసింది. "ఎట్టకేలకు ఇది జరుగుతోంది. నేను ఎంతగానో అభిమానించే ఎన్టీఆర్‌తో కలిసి నటించేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నా." అని జాన్వీ పేర్కొంది.

జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు ఎంతో ఇష్టమని గతంలో పలు సందర్భాల్లో జాన్వీ చెప్పింది. ఆయనతో కలిసి నటించే అవకాశమొస్తే తప్పకుండా చేస్తానని కూడా స్పష్టం చేసింది. తాజా ప్రకటనతో జాన్వీ కల నెరవేరినట్లయింది. జాన్వీ కపూర్‌కు తెలుగులో ఇదే తొలి చిత్రం కావడం విశేషం.

ఎన్టీఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ కే నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహిరంచారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్చున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా సాబు సిరిల్, రత్నవేలు ఛాయగ్రహణం, శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం