OTT: ఓటీటీలో ట్రెండింగ్లో టాప్కు వచ్చేసిన కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ
21 April 2024, 22:19 IST
- Siren OTT Streaming: సైరన్ సినిమా ఓటీటీలో దూసుకెళుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓటీటీలో ప్రస్తుతం టాప్లో ట్రెండింగ్కు వచ్చేసింది ఈ మూవీ.
OTT: తెలుగు వెబ్ సిరీస్ను వెనక్కి నెట్టి ఓటీటీలో ట్రెండింగ్లో టాప్కు వచ్చేసిన కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్
Siren OTT Streaming: జయం రవి, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలు పోషించిన యాక్షన్ థ్రిల్లర్ ‘సైరన్’ చిత్రం చాలాకాలం సందిగ్ధత తర్వాత థియేటర్లలో రిలీజ్ అయింది. పలుసార్లు వాయిదాలు పడిన ఈ తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. అయితే, ఈ సైరన్ సినిమా రీసెంట్గా ఓటీటీలో స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది.
ఐదు భాషల్లో స్ట్రీమింగ్
సైరన్ సినిమా డిస్నీ+ హాట్స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఏప్రిల్ 19న తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. పాన్ ఇండియా రేంజ్లో ఐదు భాషల్లో ఈ చిత్రం హాట్స్టార్లోకి అడుగుపెట్టింది.
ట్రెండింగ్లో టాప్కు..
సైరన్ సినిమాకు హాట్స్టార్ ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి భారీ వ్యూస్ వస్తున్నాయి. దీంతో హాట్స్టార్ ఓటీటీ ఇండియా ట్రెండింగ్లో టాప్కు వచ్చేసింది సైరన్ మూవీ. టాప్లో ట్రెండ్ అవుతోంది.
సేవ్ ది టైగర్స్ 2ను దాటి..
తెలుగు వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్ సీజన్ 2’ సుమారు నెల రోజులుగా డిస్నీ+ హాట్స్టార్ ఓటీటీలో టాప్లో ట్రెండ్ అవుతోంది. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్ మార్చి 15న రాగా.. మొదటి నుంచి మంచి వ్యూస్ సాధించింది. ట్రెండింగ్లో దూసుకెళ్లింది. అయితే, సైరన్ చిత్రం ఇప్పుడు సైవ్ ది టైగర్స్ సీజన్ 2ను దాటేసి.. ప్రస్తుతం హాట్స్టార్ ఓటీటీలో ట్రెండింగ్లో టాప్కు వచ్చింది. ఆ వెబ్ సిరీస్ రెండో స్థానంలో ఉంది.
సైరన్ గురించి..
సైరన్ సినిమాలో జయంరవి, కీర్తి సురేశ్తో పాటు అనుపమ పరమేశ్వరన్, సముద్రఖని, యోగిబాబు, ఇన్సేన్ అష్రాఫ్, అళగం పెరుమాల్, అజయ్ కీరోల్స్ చేశారు. ఈ చిత్రానికి ఆంటోనీ భాగ్యరాజ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో పోలీస్గా సీరియస్ క్యారెక్టర్ చేశారు కీర్తి. ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.
సైరన్ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్, సామ్ సీఎస్ సంగీతం అందించారు. హోం మూమీ మేకర్స్ పతాకంపై సుజాత విజయ్ కుమార్ నిర్మించిన ఈ మూవీకి సెల్వకుమార్ ఎస్కే సినిమాటోగ్రఫీ చేశారు.
సైరన్ స్టోరీ బ్యాక్డ్రాప్
భార్య జెన్నీఫర్ (అనుపమ పరమేశ్వన్)ను హత్య చేసిన కేసులో తిలక్ (జయం రవి) అరెస్ట్ అవుతాడు. అయితే, అతడు పెరోల్తో బయటికి వచ్చినప్పుడల్లా కొన్ని హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్య కేసులను పోలీస్ ఇన్స్పెక్టర్ నందినీ (కీర్తి సురేశ్) విచారిస్తారు. తిలక్పై అనుమానంతో మళ్లీ అరెస్ట్ చేస్తూ ఉంటుంది. సరైన ఆధారాలు లేకవిడిచి పెడుతుంది. అసలు జెన్నీఫర్ను నిజంగా తిలకే హత్య చేశాడా? విచారణలో బయటపడిన నిజాలు ఏంటి? తిలక్కు అతడి కూతురు (యువినీ) దగ్గరవుతుందా అనేది సైరన్ మూవీలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ ఈ చిత్రం వచ్చింది. మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.
టాపిక్