తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vennela Vennela Song From Top Gear: టాప్ గేర్ నుంచి తొలి పాట వచ్చేసింది.. సిద్ శ్రీరామ్ గళంలో అదిరే మెలోడీ

Vennela Vennela Song from Top Gear: టాప్ గేర్ నుంచి తొలి పాట వచ్చేసింది.. సిద్ శ్రీరామ్ గళంలో అదిరే మెలోడీ

25 November 2022, 22:35 IST

    • Vennela Vennela Song from Top Gear: ఆది సాయికుమార్ నటించిన టాప్ గేర్ చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి తొలి పాట విడుదలైంది. సిద్ శ్రీరామ్ ఆలపించిన వెన్నెల వెన్నెల సాంగ్ ఆకట్టుకుంటోంది.
టాప్ గేర్ నుంచి మెలోడీ సాంగ్ విడుదల
టాప్ గేర్ నుంచి మెలోడీ సాంగ్ విడుదల

టాప్ గేర్ నుంచి మెలోడీ సాంగ్ విడుదల

Vennela Vennela Song from Top Gear: టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే పలు చిత్రాల్లో సందడి చేసిన ఈ హీరో ప్రస్తుతం మరో యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే టాప్ గేర్. ఈ సినిమాకు కే శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆది సరసన రియా సుమన్ హీరోయిన్‌గా చేస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఈ మూవీ నుంచి ఫస్ట్ పాటను విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

వెన్నెల వెన్నెల అంటూ సాగే ఈ పాటను శుక్రవారం సాయంత్రం టాప్ గేర్ టీమ్ విడుదల చేసింది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ మెలోడీ శ్రోతలను అలరిస్తోంది. వినేందుకు వినసొంపుగా ఉన్న ఈ పాట అద్భుతంగా సాగింది. సరస్వతీ పుత్రుడు రామజోగయ్య శాస్త్రీ ఈ పాటకు సాహిత్యాన్ని సమకూర్చారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ స్వరాలు సమకూర్చారు. మెలోడీగా సాగే ఈ పాట యువతను విపరీతంగా ఆకర్షిస్తోంది. పాటలో సన్నివేశాలు కూడా.. మ్యూజిక్‌కు తగినట్లుగా ఉన్నాయి.

ఇప్పటికే టాప్ గేర్ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్ట్, గ్లింప్స్‌తో ప్రేక్షకులను మంచి హైప్ క్రియేట్ చేసింది చిత్రబృందం. తాజాగా ఈ మెలోడీ సాంగ్‌తో ఈ అంచనాలను మరింత పెంచేసింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం డిసెంబరు 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

శ్రీ ధనలక్ష్మీ బ్యానర్‌పై ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీ శ్రీధర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రియా సుమన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తోంది. కే శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. బ్రహ్మాజీ, సత్యం రాజేశ్. మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం