Gold and silver rates today : హైదరాబాద్లో రూ. 57వేల ఎగువకు పసిడి ధర..
06 May 2023, 9:05 IST
- Gold and silver rates today : దేశవ్యాప్తంగా పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి బంగారం ధరలు ఇలా..
Gold and silver rates today : దేశంలో బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 పెరిగి.. రూ. 57,210కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 57,200గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 పెరిగి, రూ. 5,72,100కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 5,721గా కొనసాగుతోంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 వృద్ధి చెంది.. రూ. 62,410కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 62,400గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 పెరిగి.. రూ. 6,24,100గా ఉంది.
Gold rate today : ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,360గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,560గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 57,760 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 63,010గా ఉంది. ముంబై, పూణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,760గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,010గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 57,260గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 62,460గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,210గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,410గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,260గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 62,460గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 57,210గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,410గా ఉంది.
ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు శనివారం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,825గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 78,250కి చేరింది. శుక్రవారం కూడా ఇదే ధర పలికింది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 83,700 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 78,250.. బెంగళూరులో రూ. 83,700గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 410 పెరిగి.. రూ 27,850కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 27,440గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 27,850గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.