Revanth Allegations: కేసీఆర్‌ నేతృత్వంలో రూ.800కోట్ల భూకుంభకోణం..రేవంత్ ఆరోపణ-revanth reddy said that kcr was involved in a huge land scam in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Revanth Reddy Said That Kcr Was Involved In A Huge Land Scam In Hyderabad

Revanth Allegations: కేసీఆర్‌ నేతృత్వంలో రూ.800కోట్ల భూకుంభకోణం..రేవంత్ ఆరోపణ

HT Telugu Desk HT Telugu
Apr 12, 2023 09:02 AM IST

Revanth Allegations:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. “భూ దోపిడీ చేసిన సొమ్ములతో కేసీఆర్ దేశంలో రాజకీయ పార్టీలకు ఎర వేస్తున్నాడని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ వంద మంది దావూద్ ఇబ్రహీంలతో సమానమని మండిపడ్డారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

Revanth Allegations: తెలంగాన సిఎం కేసీఆర్ రాజకీయ జూదగాడిగా మారాడని ప్రజాస్వామ్యాన్ని జూదంగా మార్చి, ఎన్నికలను ధనమయం చేసి దేశాన్ని అస్థిర పరచాలనే కుట్రపూరిత ఆలోచనతో కేసీఆర్ ఉన్నాడని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్‌ విధానాలు అత్యంత ప్రమాదకరమన్నారు. తన అనుచరులకు నిబంధనలకు విరుద్ధంగా భూములు కేటాయిస్తూ కోట్ల రూపాయలను దోపీడీ చేస్తున్నారని హెటిరో పార్థసారధి రెడ్డి వ్యవహారాన్ని నిన్న వెలుగులోకి తెచ్చిన రేవంత్ రెడ్డి, తాజాగా యశోథా సంస్థకు భూముల కట్టబెట్టడం వెనుక జరిగిన కుట్రను బయట పెట్టారు.

రూ. 800 కోట్లకే భూమి..రూ 100 కోట్లకే

రూ.800 కోట్ల విలువైన భూమిని కేవలం రూ. 100 కోట్ల కే యశోథా సంస్థకు కేటాయించినట్లు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2010 లో వైద్య ఆరోగ్య రంగంలో పరిశోధనలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అమెరికాకు చెందిన అలగ్జాండ్రియా అనే కంపెనీకి శేరిలింగంపల్లి మండలం, ఖానాపూర్ గ్రామం సర్వే నెంబర్ 41/14 లో ఐదు ఎకరాల స్థలాన్ని, ఎకరం రూ.10 కోట్ల చొప్పున ధర నిర్ణయించి కేటాయిస్తూ సేల్ డీడ్ చేసుకుంది.

జీవో నెంబర్ 1484పై, లోకాయుక్త అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని అక్కడ ఎకరం ధర రూ. 10 కోట్లు కాదు, రూ.12 కోట్లు ఉందని నిర్ధారణ కావడంతో ఈ మేరకు ఆ సర్వే నెంబర్ లో స్థలం పొందిన అలగ్జాండ్రియాతో పాటు మారుతి సుజుకీ కంపెనీలకు 2012 జూన్ 5న హెచ్ఎండీఏ లేఖ రాసిందని, సదరు సర్వే నెంబర్ లో ఎకరం రూ.12 కోట్లు ధర పలుకుతున్నందున ముందుగా చెల్లించిన మొత్తానికి అదనంగా... ఎకరానికి రూ.2 కోట్లు చెల్లించాలని ఆ లేఖలో పేర్కొంది. ఈ లేఖపై స్పందించిన మారుతి సుజుకీ తనకు కేటాయించి రెండు ఎకరాల స్థలానికి అదనంగా చెల్లించాల్సిన రూ.4 కోట్లు చెల్లించిందని, అలగ్జాండ్రియా మాత్రం ఈ అంశం పై కోర్టుకు వెళ్లిందన్నారు. కోర్టులో ఈ వివాదం నడుస్తుండగానే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిందని రేవంత్ వివరించారు.

కంపెనీలో డైరెక్టర్లుగా చేరి భూమి కొట్టేశారు…

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఖానామెట్ గ్రామంలో సర్వే నెంబర్ 41/14లో ఉన్న భూమిపై కల్వకుంట్ల మాఫియా కన్నుపడిందని, అలగ్జాండ్రియాకు కేటాయించిన ఐదెకరాలు, దాని పక్కనే ఉన్న మరో మూడెకరాలు అత్యంత ఖరీదైన భూమిపై కల్వకుంట్ల మాఫియా కన్నుపడిందని అప్పటికే అలగ్జాండ్రియాకు కేటాయించిన భూమి ధర వివాదం కోర్టులో ఉండటంతో... దానిని సాకుగా చూపి అలగ్జాండ్రియాను బెదిరించి... 2016లో అలగ్జాండ్రియా కంపెనీలోకి కల్వకుంట్ల జగన్నాథరావు, గోరుకంటి రవీందర్ రావు, గోరుకంటి దేవేందర్ రావు డైరెక్టర్లుగాచొరబడ్డారన్నారు.

జగన్నాథరావుకు కల్వకుంట్ల అనే ఇంటి పేరు తప్ప ఎటువంటి అర్హత లేదని తెలిపారు. ఆ విధంగా అలగ్జాండ్రియా అనే కంపెనీ కల్వకుంట్ల మాఫియా సొంతమైందన్నారు. ఆ తర్వాత కోర్టులో ఉద్ధేశ పూర్వకంగానే కేసు ఓడిపోయి... తన మనుషులు డైరెక్టర్లుగా ఉన్న అలగ్జాండ్రియాకు రూ.500 కోట్ల విలువైన భూమిని దారాదత్తం చేశారని ఆరోపించారు. కల్వకుంట్ల మాఫియా ఈ భూమిని కొట్టేయాలన్న పక్కా ప్రణాళికతో ఉన్నందునే కోర్టు తీర్పుపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్లలేదని ఆరోపించారు.

ప్రభుత్వ ఖజానాకు చిల్లు…

ప్రభుత్వ ఖజానాకు అదనంగా రావాల్సిన రూ.10 కోట్లు రాలేదని, రూ.500 కోట్ల అత్యంత విలువైన ప్రభుత్వ భూమి అతి తక్కువకే భూ మాఫియా పరమైందన్నారు. 2018 లో ఈ భూ వివాదంపై కావాలనే కేసు ఓడిపోయారని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ కేసును సుప్రీం కోర్టులో ఎందుకు అప్పీల్ కు వెళ్లలేదని ప్రశ్నించారు. అర్హత లేకపోయినా వారికి కట్టబెట్టిన భూమిని వెనక్కి తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందన్నారు.

ఇదే సర్వే నెంబర్ లో ఉన్న ప్రభుత్వ భూమి మూడెకరాలపై వాళ్ల కన్నుపడిందని దానిని కూడా తక్కువ ధరకు కొట్టేసే కుట్రకు మళ్లీ తెర లేచిందన్నారు. వాస్తవానికి హైటెక్ సిటీ సమీపంలో ఉన్న భూమి ధర 2017లో గజానికి రూ. రెండు లక్షలకు తక్కువ లేదని ఎకరా సుమారుగా రూ.100 కోట్లు ఖరీదు చేస్తుందన్నారు. ఇదే సర్వే నెంబర్ లో మెయిన్ రోడ్ ఫేస్ ఉన్న 14,278 గజాల (సుమారు మూడెకరాలు) ప్రభుత్వ భూమిని యశోథా గ్రూప్ గజం రూ.37,611 కు కొనుగోలు చేసిందని, ఎకరం సుమారు రూ.18.20 కోట్లు మాత్రమే అన్నారు.

మార్కెట్ ధర కంటే తక్కువకే విక్రయం…

రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారులు 2016 ఆగష్టు 10న ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన ధరే ఎకరాకు రూ.33.70 కోట్లు ఉందన్నారు. యశోథా గ్రూప్ కొనుగోలు చేసిన మూడు ఎకరాల (14,278 గజాలు) ప్లాటుకు ఆనుకుని వెనుకవైపు ఉన్న ప్లాట్ల అమ్మకానికి హెచ్ఎండీఏ గజానికి రూ.80 వేలు అప్ సెట్ ప్రైస్ గా నిర్ధారించిందని, అంటే ఎకరాకు రూ.39 కోట్లు ధర ఉందన్నారు. ఈ రెండు ధరలను కాదని కేవలం రూ.18.20 కోట్లకే యశోథా గ్రూప్ ప్రభుత్వ భూమిని సొంతం చేసుకుందంటే దోపిడీ ఎలా జరిగిందో కళ్లకు కట్టినట్టు అర్థమవుతోందన్నారు.

హైదరాబాద్‌లో జరిగిన భూ దోపిడీలో అలగ్జాండ్రియాలో రూ.500 కోట్లు, యశోథా గ్రూప్ కు కట్టబెట్టిన రూ.300 కోట్లు ఉంటుందని, మొత్తం రూ.800 కోట్ల విలువైన భూమిని కేవలం రూ. 100 కోట్ల కే కొట్టేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

IPL_Entry_Point