SWAN Turbine : సంగారెడ్డిలో స్వాన్ ట‌ర్బైన్ స‌ర్వీసెస్ రెండో ప్లాంటు ప్రారంభం-minister harish rao attends swan turbine services inauguration ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Minister Harish Rao Attends Swan Turbine Services Inauguration

SWAN Turbine : సంగారెడ్డిలో స్వాన్ ట‌ర్బైన్ స‌ర్వీసెస్ రెండో ప్లాంటు ప్రారంభం

HT Telugu Desk HT Telugu
Aug 07, 2022 05:11 PM IST

సంగారెడ్డి జిల్లాలో స్వాన్ టర్బైన్ సర్వీసెస్ రెండో ప్లాంటు ప్రారంభమైంది. కొత్త ప్లాంటుతో 300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవ‌కాశాలు లభించనున్నాయి.

స్వాన్ టర్బైన్
స్వాన్ టర్బైన్

హైద‌రాబాద్‌కు చెందిన స్వాన్ ట‌ర్బైన్ స‌ర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప‌వ‌ర్ ప్లాంట్లు, పెట్రో కెమిక‌ల్స్, స్టీలు, ఫెర్టిలైజ‌ర్స్, సిమెంటు, పేప‌ర్ త‌దిత‌ర పరిశ్రమలకు అంత‌ర్జాతీయంగా సేవ‌లు అందిస్తుంది. ఓవ‌ర్‌హాల్స్, రీఫ‌ర్బిష్‌మెంట్లు, విడిభాగాలు, సేవ‌లు, మ‌ర‌మ్మతులు, రెట్రోఫిట్లు, రీఇంజనీరింగ్‌, ప‌వ‌ర్ ప్లాంట్ల రీలొకేష‌న్ త‌దిత‌ర పనులు చేస్తుంది. ఇప్పుడు సంగారెడ్డిలో తన రెండో ప్లాంట్ ప్రారంభించింది.

సంగారెడ్డి జిల్లా పాశ‌మైలారంలో స్వాన్ ట‌ర్బైన్ స‌ర్వీసెస్ రెండో ప్లాంటును తెలంగాణ రాష్ట్ర మంత్రి హ‌రీశ్ రావు ప్రారంభించారు. మెద‌క్ ఎంపీ ప్రభాక‌ర్ రెడ్డి, ప‌టాన్ చెరు ఎమ్మెల్యే మ‌హిపాల్ రెడ్డి, శేరిలింగంప‌ల్లి ఎమ్మెల్యే అరెక‌పూడి గాంధీ త‌దిత‌రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

'మంత్రి హ‌రీశ్ రావు ఈ ప్లాంటును ప్రారంభించ‌డానికి వ‌చ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాం. ఈ ప్లాంటుతో 300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి క‌ల్పిస్తాం. సాంకేతిక‌, ఇంజినీరింగ్ సామ‌ర్థ్యం, నాణ్యతకు పెద్దపీట వేయ‌డం, స‌మయానికి డెలివ‌రీ ఇవ్వడంలాంటి బ‌లాల పునాదుల మీదే మా వ్యాపారం మొద‌లైంది. స్వాన్ ట‌ర్బైన్ స‌ర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేక ప్రభుత్వ రంగ సంస్థలకు విడిభాగాలు అందిస్తుంది.' అని సంస్థ ఎండీ పి.స‌త్యనారాయ‌ణ తెలిపారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్