IRCTC Tourism Package: హైదరాబాద్ నుంచి కర్ణాటక టూర్ - ఈ ప్రాంతాలను చూడొచ్చు-irctc tourism announced coastal karnataka tour package from hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Irctc Tourism Announced Coastal Karnataka Tour Package From Hyderabad

IRCTC Tourism Package: హైదరాబాద్ నుంచి కర్ణాటక టూర్ - ఈ ప్రాంతాలను చూడొచ్చు

Mahendra Maheshwaram HT Telugu
Aug 25, 2022 12:13 PM IST

hyderabad - coastal karnataka tour package:హైదరాబాద్ నుంచి కర్ణాటక టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

హైదరాబాద్ - కర్ణాటక టూర్
హైదరాబాద్ - కర్ణాటక టూర్ (irctc tourism)

irctc tourism hyd to coastal karnataka tour package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి కర్ణాటక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. Coastal Karnataka పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. ఉడిపి, శృంగేరి, మురుదేశ్వర్ వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.....

ట్రెండింగ్ వార్తలు

6 రోజులు 5 రాత్రులు…

hyderabad -coastal karnataka tour: ఈ నెల ఆగస్టు 30న ఈ టూర్ ప్రారంభం అవుతుంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. తొలిరోజు కాచిగూడ స్టేషన్ నుంచి ఉదయం 06.05 ట్రైన్(No.12789, Kacheguda - Mangalore Central Express) బయల్దేరుతుంది. రెండో రోజు ఉదయం 09.30 గంటలకు మంగళూరు సెంట్రల్ స్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడ్నుంచి ఉడిపికి చేరుకుంటారు. హోటల్ లో చెకిన్ అయిన తర్వాత... శ్రీకృష్ణ ఆలయం, సెయింట్ మేరీ ఐల్యాండ్, మల్పీ బీచ్ ను సందర్శిస్తారు. రాత్రి ఉడిపిలోనే బస చేస్తారు.

ఇక మూడో రోజు ఉడిపి నుంచి శృంగేరికి బయల్దేరారు. ఇక్కడ శారదంబ ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం కొల్లూరు, ముకాంబికా ఆలయాలకు వెళ్తారు. ఆ తర్వాత మురుదేశ్వర్ కు చేరుకుంటారు. నాల్గొ రోజు ఉదయమే ఆలయ సందర్శన ఉంటుంది. అక్కడ్నుంచి జోగ్ వాటర్ ఫాల్స్ కు వెళ్తారు. మధ్యాహ్నం గోకర్నా సందర్శన తర్వాత... తిరిగి మురుదేశ్వర్ కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఐదో రోజు మంగళూరుకు చేరుకుంటారు. కటీల్, మంగలా ఆలయాలను దర్శించుకుంటారు. రాత్రి 7 గంటల వరకు మంగళూరు సెంట్రల్ కు చేరుకొని హైదరాబాద్ కు తిరుగు పయనం అవుతారు. ఆరో రోజు రాత్రి 11.40 గంటలకు కాచిగూడకు చేరుకోవటం టూర్ ముగుస్తుంది.

ధరలివే....

coastal karnataka hyd tour cost: సింగిల్ షేరింగ్ కు 33,160 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 19,010 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు 14990గా ఉంది. టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు.

<p>ధరల వివరాలు</p>
ధరల వివరాలు (irctctourism.com)

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

IPL_Entry_Point