సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది. పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని రసాయన, పెయింట్ పరిశ్రమల్లో మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ మంటలు పక్కన ఉన్న రసాయనలతో కూడిన డ్రములకు అంటుకోవటంతో పరిశ్రమలోని యంత్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
సమాచారం అందకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. సంగారెడ్డి, పటాన్చెరు, బొల్లారం ప్రాంతాలకు చెందిన ఫైర్ యంత్రాలను కూడా రప్పించారు. మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు.
టాపిక్