యుగానికే ఆదర్శ పురుషుడిగా వెలుగొందుతున్న శ్రీరామ చంద్రుడ్ని స్మరించుకుంటే కలిగే ప్రయోజనాలెన్నో.. మానసికంగా అనేక సమస్యలను ఛాలెంజ్ చేయగలిగేంత సమర్థత తెచ్చిపెట్టడమే కాకుండా బలవంతులుగా కూడా మారతామని పురాణాలు చెబుతున్నాయి. 'రామ' అనే పదం వినగానే అంతరాత్మ మేల్కొని మెదడుకు సానుకూల ఆలోచనలు కలిగిస్తుంది. శ్రీరామ అనే పదం వింటే రక్త సరఫరా మెరుగై శరీరం మొత్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలో ఉండే ఏడు చక్రాలలో రెండైన 'రా', 'ఓం'లు కలయికతో ఏర్పడే రామ్ అనే పదం వినగానే శరీరంలోని అంతర్గత శక్తి మేల్కొని అద్భుతాలు సృష్టిస్తుంది.
రాముని పట్ల భక్తితో ఉండటం ఆయన అనుసరించిన నియమాలను పాటించడం అంటే పరిపూర్ణమైన ఆధ్మాత్మికతతో జీవిస్తున్నట్లే. ఇంకా ఆయనను స్మరించుకుంటూ ఈ మంత్రాలను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకుంటే మీ కష్టాలను తుడిచేసి, సంపన్నులుగా మారుస్తాడని శాస్త్రం చెబుతుంది.
ఈ మంత్రం పఠించడం వల్ల సదా శ్రీరాముని దయ మనపై ఉండి మనస్సులో ప్రశాంతత నెలకొంటుంది. అంతేకాకుండా సన్మార్గంలో నడిపిస్తాడు.
ఈ మంత్రం పఠించడం ద్వారా శ్రీరాముడు మహిమను అనుభవించడమే కాకుండా ఆయన గుణాలను అలవరచుకోవచ్చు.
రామ గాయత్రీ మంత్రం సీతమ్మ తల్లిని ధ్యానించే సందర్భంలో ఉపయోగిస్తారు. శ్రీరామునికి పవిత్రమైన సీతమ్మ తల్లిని తలుచుకున్న వెంటనే మెదడులో ఆలోచనలు స్థిరత్వాన్ని సంతరించుకుంటాయి.
రామ, కోదండ అనే పదాలు తిరుగులేని గుణాన్ని, అత్యున్నతమైన వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి. ఈ మంత్రం పఠించడం వల్ల విజయం ప్రాప్తించడం, ఆందోళనల నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఆధ్మాత్మిక అవగాహన ప్రయత్నంలో ఉన్న వారికి ఈ మంత్రం మార్గదర్శినిలా పనిచేస్తుంది.
భక్తుడికి ఈ మంత్రం చదివితే తాను చేయాలనుకున్న పనిపై స్పష్టత పెరుగుతుంది. అంతేకాకుండా అపవిత్రంగా ఉన్న మనస్సును శుద్ధి చేస్తుంది.
ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా పఠించడం వల్ల శారీరకంగానూ, మానసికంగానూ వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటారు. దాంతోపాటు భౌతిక గాయాల నుంచి ఉపశమనం కలిగించి శరీరానికి సాంత్వన కలిగిస్తుంది.
ఈ మంత్రం పఠించడం వల్ల చంద్ర భగవానుడితో పాటు శ్రీరాముడిని స్మరించినట్లు అవుతుంది. ఈ మంత్రోచ్ఛారణతో కలిగే ప్రతిధ్వనుల ఫలితంగా మానసికంగా ఉపశమనం కలిగి ప్రశాంతతను అందజేస్తాయి.