(1 / 5)
ఉద్యోగుల సర్దుబాటు, బదిలీల్లో స్థానికతను పరిగణలోకి తీసుకోవాలని.. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించాలనే డిమాండ్ తెలంగాణలో చాలా రోజులుగా ఉంది. అదే సమయంలో 317 జీవోను రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కీలక ప్రకటన చేశారు.
(HT)(2 / 5)
గత ప్రభుత్వం తెచ్చిన జీవో 317తో ఇబ్బంది పడుతున్న ఉపాధ్యాయులకు దసరా పండగ లోపు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందిస్తుందని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు.
(@Drpmahendereddy)(3 / 5)
317 జీవో అంశంపై మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపసంఘం.. త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుందని శ్రీధర్ బాబు వెల్లడించారు.
(@Drpmahendereddy)(4 / 5)
శనివారం అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆధ్వర్యంలో చేవెళ్లలో తెలంగాణ ప్రజా పాలనలో ఉపాధ్యాయుల పాత్ర అంశంపై విద్యా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో శ్రీధర్ బాబు 317 జీవో అంశంపై మాట్లాడారు.
(@Drpmahendereddy)(5 / 5)
ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలు, డీఏ పెంపు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని.. పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు మంత్రిని కోరారు. ఈ అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.
(@Drpmahendereddy)ఇతర గ్యాలరీలు