(1 / 7)
మరికొద్దిరోజుల్లో ఈ ఏడాది ముగియనుంది. కొత్త సంవత్సరం ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే ఇయర్ ఎండ్ వేళ చాలా మంది ఏదో ఒక ట్రిప్ కు వెళ్తుంటారు. అయితే తెలంగాణ టూరిజం పలు రకాల టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది.
(2 / 7)
తక్కువ ధరలోనే ఈ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తుండగా… ముందస్తుగానే టికెట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ట్రైన్ జర్నీ, మరికొన్ని బస్సు జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తోంది. https://tourism.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవచ్చు.
(3 / 7)
Shirdi Ellora Tour - Telangana Tourism పేరుతో హైదరాబాద్ నుంచి షిర్డీకి టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ట్రైన్ జర్నీ ఉంటుంది. ఈ ప్యాకేజీ డిసెంబర్ 20వ తేదీన అందుబాటులో ఉంది.
(4 / 7)
కేవలం రూ. 800 ధరతోనే నాగార్జున సాగర్ ట్రిప్ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. హైదరాబాద్ నుంచి బస్సులో వెళ్లాల్సి ఉంటుంది. బుద్ధవనంతో పాటు సాగర్ డ్యామ్ చూపిస్తారు. ఈ ప్యాకేజీ డిసెంబర్ 21, 2024వ తేదీన అందుబాటులో ఉంది.
(5 / 7)
ఇక అరకు చూసేందుకు కూడా తెలంగాణ టూరిజం ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. 4 రోజులపాటు ఈ ట్రిప్ ఉంటుంది. ఈ ట్రిప్ లో భాగంగా… అన్నవరం, సింహాచలం, వైజాగ్, ఆర్కే బీచ్, కైలాసగిరి, అరకులోని బొర్రా గుహలు, అనంతగిరి చూడొచ్చు. ఈ ప్యాకేజీ డిసెంబర్ 18, 2024వ తేదీన అందుబాటులో ఉంది.
(6 / 7)
హైదరాబాద్ లోని పలు ప్యాలెస్ లు చూసేందుకు ‘Nizam Palaces Tour - Telangana Tourism 21’ పేరుతో ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ట్రిప్ ను బుకింగ్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీ డిసెంబర్ 21, 2024వ తేదీన అందుబాటులో ఉంది.
(7 / 7)
https://tourism.telangana.gov.in/home లింక్ పై క్లిక్ చేసి టూర్ ప్యాకేజీలే కాకుండా మరికొన్నింటిని కూడా చూడొచ్చు. ఇదే వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ కూడా చేసుకోవచ్చు.
ఇతర గ్యాలరీలు